బాలకృష్ణ ఏం తీసేయమని చెప్పారు..? అసలు ఇలా చెప్పడానికి కారణం ఏంటి..?

Ads

నందమూరి బాలకృష్ణ… జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య గత కొద్దికొద్ది రోజులుగా దూరం ఉంది అనే వార్త తెలిసిందే. ఇది అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంది. అయితే తాజాగా ఈ విషయం మరోసారి స్పష్టమైనది. గురువారం స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించడానికి విచ్చేశారు….!

అయితే ఈరోజు తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించారు. ఆ సమయంలో అక్కడికి ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున విచ్చేసి ఎన్టీఆర్ కటౌట్లు ఏర్పాటు చేసి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం వాటిని పట్టించుకోకుండా వచ్చిన పని చూసుకుని వెళ్లిపోయారు.

Ads

 

తర్వాత కొద్దిసేపటికి అక్కడికి నందమూరి బాలకృష్ణ వారి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. అక్కడ ఎన్టీఆర్ కటౌట్లు ఉండడం చూసి వెంటనే సిబ్బందితో కట్ అవుట్ లు తీసేయమని చెప్పారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఎన్టీఆర్ కటౌట్లు తొలగించారు. ఈ విషయంపై నందమూరి అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ అలా చెప్పడం వల్ల మరోసారి ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు బయట పడ్డాయి. బాలకృష్ణ అలా చెప్పడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అసలు బాలయ్య అలా ఎందుకు అన్నాడు అనే దానిపైన స్పష్టత లేదు.

watch video :

 

Previous articleఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా..? చాలా మారిపోయారు కదా..?
Next articleశేఖర్ మాస్టర్, సందీప్ మాస్టర్ ఒక పాటకి ఎంత తీస్తారో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.