అతడు మూవీలో ఆ సన్నివేశాన్ని ఆ నవల నుండి కాపీ చేశారని తెలుసా?

Ads

త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా అతడు. ఈ చిత్రం మీద ఆడియెన్స్ కి మంచి అభిప్రాయం ఉంది. త్రివిక్రమ్ రచయితగా విజయం పొందాడు. ఆయన దర్శకుడిగా మారి తీసిన నువ్వే నువ్వే చిత్రం యావరేజ్ గా నిలిచింది.

Ads

దాంతో తరువాత చేయబోయే మూవీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాడు. ఆ క్రమంలో మంచి స్టోరీ రాసుకొని మూవీ చేయాలనుకున్నప్పుడు మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు.
ఇది ఇలా ఉండగా  త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించే ప్రతి సినిమాలోనూ  ఏదో ఒక సన్నివేశం కానీ, కథను  కానీ కాపీ కొట్టారనే మాట ఎప్పటి నుండో బలంగా వినిపిస్తూనే ఉంది. అలాగే అతడు చిత్రం పైన కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. అవి ఏమిటి అంటే అతడు మూవీలో మహేష్ బాబు, సునీల్ ఇద్దరు రాత్రి సమయంలో పంతులు ఇంటికి వెళ్తారు. అప్పుడు వారి ఇంట్లో ఉన్న చెట్ల దగ్గర మనీ వేసే సన్నివేశంలో సునీల్ మాట్లాడిన మాటలన్నీ కూడా కాపీ చేశారంట. ప్రఖ్యాత రచయిత మధుబాబు రాసిన యముడు అనే పుస్తకంలో ఇలాంటి ఒక సన్నివేశం ఉంటుంది. అయితే అందులో  రాముడు లక్ష్మణుడు ఇంటికి వచ్చినట్టుగా చెప్తాడు. అతడు సినిమాలో  సీత లేని రాముడు అని, తోక లేని హనుమంతుడు అని చెప్తాడు. ఈ సన్నివేశంలో కొంచెం మాటలు మార్చి  మూవీలో పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో  మరో సన్నివేశం కూడా తీసుకున్నారు. ఆ సీన్ ఏంటంటే హీరో చిన్నతనంలో స్నేహితుడితో అర్థ రాత్రి పూట స్మశానంలోకి వెళ్ళే పందెం పెట్టుకునే సన్నివేశం కూడా మధు బాబు పుస్తకంలో నుండి తీసుకున్నారు. అయితే త్రివిక్రమ్ ఈ సీన్ కి ఒక్కదానికి మధు బాబు అనుమతి తీసుకున్నారని మధు బాబు అప్పట్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read: టాలీవుడ్ లో త్రిపాత్రాభినయం చేసిన 9 మంది హీరోలు వీరే..

Previous article3 గంటలు థియేటర్ లో ఈ సినిమా ఎలా చూడగలిగారు? అంటూ…”యానిమల్” పై కామెంట్స్ చేసిన గృహలక్ష్మీ కస్తూరి..!
Next articleఅల్లు అరవింద్ ప్లానింగ్ మాములుగా లేదుగా..? ఆ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా లేనట్టేనా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.