థియేటర్లో రిలీజ్ అయ్యి నెల కూడా కాలేదు..అప్పుడే ఓటిటిలోకి.! ఇంతకీ సినిమా ఎలా ఉంది.?

Ads

ఓటీటీలో సినిమాలు చూడడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. పైగా సినిమాలు విడుదలైన 45 రోజులలోపే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. భాషా బేధం లేకుండా ఏ సినిమా కావాలన్నా హ్యాపీగా ఇంటి వద్దనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. దీంతో ఓటీటీ సంస్థలు కూడా కొత్త కొత్త సినిమాలను తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ లో సరికొత్త సినిమా సందడి చేయడానికి రాబోతోంది.

Ads

రీసెంట్ గా విడుదలైన ఎమోషనల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ మంత్ ఆఫ్ మధు. కలర్స్ స్వాతి ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. బుల్లితెరపై బాగా సందడి చేసిన స్వాతి ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాక కొన్ని రోజులు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ గడిపి ఇటీవల మళ్ళీ సినిమాల్లోకి రావడానికి ట్రై చేస్తుంది.ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ లో విడుదలైన నెల కూడా కాకముందే స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. మరి ఈ ఫీల్ గుడ్ మూవీ ఎప్పుడు ,ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.

అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంత్ ఆఫ్ మధు మూవీ లో నవీన్ చంద్ర హీరోగా నటించాడు. ఆడవారి స్వేచ్ఛ తో పాటు భార్యాభర్తల బంధం మీద కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా ప్లాట్ఫామ్ పై నవంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది.

Previous articleవరల్డ్ కప్ లో ఇండియాకి సౌత్ ఆఫ్రికాతో ఓడితేనే లాభం అంట…అప్పుడే ఆ కల నెరవేరుతుందా.?
Next articleనిన్నటి వరకు ఈ ప్లేయర్ ని తిట్టారు… ఇప్పుడు ఏమో పొగిడేస్తున్నారు… పైగా కవరింగ్ కూడా…!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.