మనిషి మరణించే 30 సెకండ్ల ముందు ఏమి జరుగుతుందో తెలుసా..?

మనిషి జీవితంలో కొన్ని విషయాలు మాత్రం చాలా ముఖ్యమైనవి. అందులో మొదటి జననం అయితే తర్వాతది మరణం. పుట్టడం మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. చనిపోయాక మనకి జరిగే కార్యక్రమాలు కూడా మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి.

ఒక మనిషి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు వారి మనసులో ఉన్న విషయాలని బయటికి చెప్పాలి అనుకున్నా కూడా చెప్పలేకపోతూ ఉంటారు. మాట్లాడలేక పోతారు. నిశ్శబ్దం గా లోకాన్ని వీడి వెళ్లిపోతుంటారు. మరణం దగ్గరికి వచ్చే వరకు ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తూ ఉంటాడు అనేది ఎవరికీ తెలియదు. అసలు మరణం సంభవించే ముందు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

న్యూరో సైంటిస్ట్ లు చేసిన రీసెర్చ్ ప్రకారం మనిషి చనిపోవడానికి ఇంకా ఒక 30 సెకండ్ల సమయం ఉందనగా.. ప్రతి వ్యక్తికీ అప్పటివరకు అతనికి గడిచిన జీవితమంతా కళ్ళముందు తిరుగుతూ ఉంటుందట. పుట్టినప్పటి నుంచి.. చివరిదాకా కలిసి తిరిగిన మనుషులు, జ్ఞాపకాలు అన్ని గుర్తుకొస్తుంటాయట. 87 సంవత్సరాల మూర్ఛ వ్యాధి ఉన్న వృద్ధుడిని సైంటిస్ట్ లు పరిశీలించారట.

అతనికి సడన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో పాటు బ్రెయిన్ లో ఉన్నట్లుండి ఊహించని యాక్టివిటీ చోటు చేసుకోవడాన్ని ఆ సైంటిస్ట్ లు గమనించారు. అంతేకాదు బ్రెయిన్ వేవ్స్ లో కూడా చాలా మార్పులు వచ్చాయట. చనిపోవడానికి 30 సెకన్ల ముందు మెదడు రక్తాన్ని తీసుకోదు. ఆ సమయంలో అతని జీవితంలోని ముఖ్య సంఘటనలు అన్నీ ఒక్కసారిగా కళ్ళముందు కనిపిస్తూ ఉంటాయి. గుండె కొట్టుకోవడం ఆగిపోయిన 30 సెకండ్ల తరువాత కూడా ఈ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంటుంది. ఆ తరువాత మనిషి ఉండడు.. అతని జ్ఞాపకాలు ఉండవు.

Previous articleటీం ఇండియాకి సరికొత్త ఆల్ రౌండర్ దొరికేసినట్టే…తెలుగు కుర్రాడు అయిన ఈ జూనియర్ హార్దిక్ పాండ్య ఎవరంటే.?
Next articleరైస్ పెట్టుకుంటే చాలు అనుకోని “కర్రీ పాయింట్స్” నుండి కర్రీ తెచ్చుకుంటున్నారా.? అయితే ఇది మీకోసమే.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.