“మ్యాన్షన్ 24” లో నటించిన ఈ నటి ఎవరో తెలుసా..?

Ads

ఓంకార్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర పై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి, పలు షోలతో ఆకట్టుకుని దర్శకుడిగా మారారు. హారర్ జానర్‌ లో మూడు చిత్రాలను తెరకెక్కించిన ఓంకార్, రీసెంట్ గా ‘మ్యాన్షన్ 24’ అనే వెబ్ సిరీస్‍ కు దర్శకత్వం వహించారు.

ఈ సిరీస్ లో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‍కుమార్ లీడ్ రోల్ లో నటించగా, సత్యరాజ్, అవికా గోర్, బిందు మాధవి ఇతర పాత్రలలో నటించారు. అయితే ఈ మూవీలో నేషనల్ అవార్డ్ పొందిన నటి కీలకపాత్రలో నటించారు. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
హారర్ వెబ్ సిరీస్ గా తెరకెక్కిన మ్యాన్షన్ 24 ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‍స్టార్ లో అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్‍ అవుతోంది. ఈ సిరీస్ లో రజియా అనే పాత్రలో కనిపించిన నటి పేరు శ్రద్ధా దంగర్. ఆమె  గుజరాతీ. ఆమె 2017లో పప్పా తమ్నీ నై సంజయ్ అనే గుజరాతీ మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరువాత తారి మాతే వన్స్ మోర్ లో నటించింది.

2019లో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మచ్చు అనే మూవీలో, గుజరాతీ పీరియాడికల్ డ్రామా హెల్లారో చిత్రంలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. హెల్లరో మూవీకి నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన శ్రద్ధా దంగర్‌ నటనకి ప్రత్యేక జ్యూరీ కేటగిరీలో అవార్డు లభించింది. ఆమె ఇప్పటివరకు గుజరాతీలో పది చిత్రాలు చేయగా, మూడు వెబ్ సిరీసులలో నటించింది.
‘మ్యాన్షన్ 24’ వెబ్ సిరీస్‌తో తెలుగులో అడుగుపెట్టింది. తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నశ్రద్ధా, టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలను పొందే పనిలో ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్ధా దంగర్‌ ను ఇన్ స్టాగ్రామ్ లో 224k ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటి కప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

Also Read: ఆ హీరోయిన్ కోసం “వేణు స్వామి” చేసిన పూజలు ఫలిస్తాయా..? ఆమె ఎవరంటే..?

 

Previous articleవరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ గెలిచిన తర్వాత భారత్ “డ్రెస్సింగ్ రూమ్”లో ఏం జరుగుతుందో తెలుసా..?
Next articleవరుణ్ తేజ్- లావణ్య పెళ్లి వేడుకలలో కనిపించని పవన్..! కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.