మారువేషంలో ఆశ్చర్యపరిచిన ఈ ప్లేయర్ ఎవరో గుర్తు పట్టారా..?

Ads

టీం ఇండియా మాజీ క్రికెట్ ప్లేయర్ అయిన అంబటి రాయుడు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అంబటి రాయుడు మారువేషంలో వచ్చి యువకులతో క్రికెట్ ఆడుతున్న సంఘటన చోటు చేసుకుంది.

మారువేషం లో యువకులతో క్రికెట్ ఆడుతూ కొంచెం సేపు అంపైరింగ్ చేస్తూ, మరి కొంచెం సేపు బ్యాటింగ్ చేస్తూ కాలక్షేపం చేశాడు అంబటి రాయుడు. అయితే కొంతసేపటికి తను అంబటి రాయుడు అని తెలుసుకున్న తోటి ఆటగాళ్లందరూ సంబరం చేసుకున్నారు.

did you recognize this player

తన ఆటోగ్రాఫ్ కోసం పోటీ పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెడుతూ అంబటి రాయుడు వాళ్లకి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు అని వైరల్ చేశారు. అయితే ఈ సంవత్సరం 2023లో ఐపీఎల్ ఫైనల్ లో అంబటి రాయుడు ఆడిన ఆటని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే ఐపీఎల్ లో ధోని కెప్టెన్ గా ఉన్న సీఎస్కే టీం లో అంబటి రాయుడు మంచి స్కోర్ తో ఫైనల్లో గెలిచేందుకు సహాయపడ్డాడు. అదే తన చివరి మ్యాచ్ అవ్వడంతో ప్రాణం పెట్టి ఆడాడు అంబటి రాయుడు.

Ads

did you recognize this player

ఆ ఆట తన క్రికెట్ కెరీర్ కి మంచి క్లైమాక్స్ అని చెప్పాలి. ఎప్పుడైతే తను రిటైర్మెంట్ చేసుకుంటున్నాను అని సోషల్ మీడియాలో పెట్టారో చాలా మంది క్రికెట్ అభిమానులకు నిరాశ చెందారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో నుంచి వెళ్లిన అంబటి రాయుడు దేశవ్యాప్తంగా తన క్రికెట్ ఆటతో అందరి మనసులను గెలుచుకున్నాడు. అంత మంచి ఆటగాడు రిటైర్ అవ్వడంతో అందరూ బాధలో మునిగారు. అతని ఆటని చాలామంది మిస్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.

did you recognize this player

ఇప్పటికే ధోని వాళ్ళు వెళ్ళిపోతున్నారని బాధలో ఉన్న ప్రేక్షకులకి అంబటి రాయుడు కూడా రిటైర్ అయిపోవడం మరొక బాధాకరమైన విషయం అని చెప్పాలి. అయినప్పటికీ చాలా రోజుల తర్వాత అంబటి రాయుడు ని ఇలా చూడడంతో క్రికెట్ అభిమానులకు కనుల పండగగా నిలిచింది ఈ సంఘటన. ఐపీఎల్ లో ఆయన ఆడిన ఆటలూ, కొట్టిన సిక్సులూ ఎప్పటికీ మర్చిపోలేనివే.

Previous articleఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా…? ఈమె ఒక స్టార్ హీరోయిన్..!
Next articleసలార్ ఇన్‌సైడ్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.