వేణు స్వామి చెప్పింది మొదటి సారి తప్పు అయ్యిందా..? ప్రభాస్ విషయంలో ఏం అన్నారంటే..?

Ads

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తన జాతకం తను చూసుకోవటం మానేసి చాలా సంవత్సరాలు అయినట్టుంది. ఎందుకంటే పాపం ఆయన జాతకం బాగున్నట్టు లేదు ఈమధ్య ఏ జాతకం చెప్పినా బెడిసి కొడుతుంది.

ఆ మధ్య వరల్డ్ కప్ ఫైనల్లో టీం ఇండియా గెలుస్తుందని ఎంతో ధీమాగా చెప్పాడు వేణు స్వామి కానీ ఫైనల్లో ఇండియా ఓడిపోయి వేణు స్వామి జ్యోతిష్యాన్ని అని కూడా ఓడించింది. అలాగే తెలంగాణ ఎన్నికల విషయంలో కూడా వేణు స్వామి జోష్యం బెడిసి కొట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కచ్చితంగా గెలిచే తీరుతుంది.

గెలవని పక్షంలో నేను జాతకాలు చెప్పడం మానేస్తాను అంటూ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో జోష్యం చెప్పాడు వేణు స్వామి. అయితే ప్రజలందరూ కూడా అలాగే భావించారు కానీ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించి బీఆర్ఎస్ ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. అప్పుడే చాలామంది వేణు స్వామిని ఇక మీరు జాతకాలు చెప్పడం మానేయొచ్చు అంటూ తెగ ట్రోల్స్ కి గురి చేశారు.

Ads

venu swamy about prabhas

ఇక ఇప్పుడు మళ్లీ వేణు స్వామి జోష్యం పై తెగ విరుచుకుపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే గతంలో వేణుస్వామి ప్రభాస్ జాతకం బాగోలేదు, హిట్లు ఉండవు మళ్లీ కిందికి వచ్చి ఈశ్వర్ వంటి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటే తప్ప హిట్లు కొట్టలేడు, ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు జాతకాలు చూపించుకోవాల్సిందే అంటూ జోష్యం చెప్పాడు.

అయితే ఇప్పుడు సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బొమ్మ బ్లాక్ బస్టర్ అవటంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామి పై ఫైర్ అవుతున్నారు. నువ్వు ఇంక తట్ట బుట్ట సర్దేయొచ్చు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరొకసారి ప్రభాస్ గురించి మాట్లాడితే ఆయనపై దాడి చేసేందుకు కూడా వెనకాడేటట్లు కనిపించడం లేదు ప్రభాస్ ఫ్యాన్స్.

Previous articleవిరాట పర్వంలో రానా ప్లేస్‌లో మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..? ఇంత మంచి ఛాన్స్ ఎలా మిస్ అయ్యారు..?
Next articleదూత సిరీస్ కి హైలైట్ అయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.