అయోధ్య కి వెళ్లే ముందు ప్రభాస్ ఇలా ఎందుకు చేశారు..? దీనికి కారణం ఏంటంటే..?

Ads

అయోధ్యలో జనవరి 22వ తారీఖున శ్రీరామ మందిర ప్రారంభోత్సవం శ్రీరాముని పట్టాభిషేక కార్యక్రమాలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానం అందించారు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

బాహుబలి ప్రభాస్ కూడా అయోధ్య రామ మందిరం కార్యక్రమానికి ఆహ్వానం పొందారు.ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నుంచి, ఆల‌య నిర్వాహ‌కుల నుంచి ప్ర‌భాస్ కి ఆహ్వానం అందిన‌ట్టు మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. అయితే అయోధ్య వెళ్లే ముందు ప్రభాస్ ఒక పని చేశాడు. ఇప్పుడు ఆ పని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

prabhas before visiting ayodhya ram mandir

ప్రభాస్ ఇప్పుడు సడన్ గా ఆ పని ఎందుకు చేశాడు..? అలా చేయాల్సిన కారణమేంటి అని ఆరాతీస్తే… కర్నాట‌క‌ లోని మంగళూరులో ఉన్న శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయాన్ని ప్రభాస్ తాజాగా సందర్శించాడు. వైట్ కాలర్ హుడీ ధ‌రించి త‌ల‌కు తెలుపురంగు మాస్క్ ని ధ‌రించి గుడిలోకి ప్ర‌వేశించాడు. అత‌డి వెంట బాడీ గార్డ్ లు ఉన్నారు. ప్రభాస్ తో పాటు స‌లార్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్, నిర్మాత కిరంగ‌దూర్ త‌దిత‌రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇంత సడన్ గా ఇలా అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వెళ్ల‌డానికి అస‌లు కార‌ణ‌మేమిటి? అని అభిమానులు ఆరా తీస్తే అస‌లు సంగ‌తి తెలిసింది.

Ads

prabhas before visiting ayodhya ram mandir

ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ సూపర్ హిట్ అయింది.అయితే ఈ సినిమా విడుదలకు ముందు సినిమా విజయం సాధిస్తే అమ్మవారి ఆలయం కి వస్తామని సినిమా టీం మొక్కుకుందంట ఆ మొక్కు తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ తో పాటు నిర్మాత,దర్శకుడు కర్ణాటకలోని మంగుళూరు వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చారట. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ని బయట చూసి ఆయన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.

watch video :

Previous articlePrajapalana : తెలంగాణ ప్రజలకు శుభవార్త..! ఇలా చేస్తే 200 యూనిట్ల కరెంటు ఉచితం..!
Next articleశివకార్తికేయన్ నటించిన అయలాన్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.