అదే మన కొంపముంచిందా.? ఇండియా ఓటమికి ఇదే ప్రధాన కారణమా.?

Ads

2003 లో జరిగినట్టే వరల్డ్ కప్ లో మరోసారి ఇప్పుడు జరిగింది. ఆస్ట్రేలియాతో చేతిలో ఫైనల్ లో ఓడిపోయింది భారత్. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కి దిగిన భారత్…నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలవుట్ అయ్యింది. విరాట్ కోహ్లీ(63 బంతుల్లో 4 ఫోర్లతో 53), కేఎల్ రాహుల్(107 బంతుల్లో ఫోర్‌తో 66), రోహిత్ శర్మ(31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47)లు తప్ప మిగిలిన ప్లేయర్స్ అందరు చెప్పుకోదగ్గ స్కోర్ ఏం చేయలేదు.

Ads

ఇక 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు…47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా…6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 120 బాల్స్‌లో 137 రన్స్ చేసి ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. లబుషేన్ (58) హాఫ్ సెంచరీతో రాణించి హెడ్‌కు సహకారం అందించాడు. నాకౌట్ మ్యాచ్‌లంటే విజృభించే ఆస్ట్రేలియా జట్టుకి…టాస్ గెలవడం బాగా కలిసొచ్చింది. మొదటి ఇన్నింగ్స్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్ ని తక్కువ స్కోర్ కె పరిమితమయ్యేలా చేసారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి డ్యూ రావడం ఆ జట్టుకు బాగా కలిసొచ్చింది.ఆ డ్యూ నే మన కొంపముంచింది.

Previous article1983 వరల్డ్ కప్ ఇండియా గెలవడం వల్ల… భారత క్రీడా రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసా?
Next articleఆ సీనియర్ ప్లేయర్ ని కాదని మరీ “సూర్య” ని ఆడించాడు…సెమీఫైనల్ దెబ్బకి “రోహిత్” ప్లాన్ మార్చాల్సింది.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.