మెట్రోలో కామన్ మ్యాన్ లాగా వెళ్తున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా..?

Ads

దేశంలోని అగ్ర నగరమైన ముంబై ఎప్పుడు ట్రాఫిక్ తో రద్దీగా ఉంటుంది. అందుకే చాలామంది అర్జెంటు పనుల్లో వెళ్ళేటప్పుడు బస్సులు గాని మెట్రో మార్గంలో గాని ప్రయాణిస్తూ ఉంటారు. ఈ మధ్య సెలబ్రిటీలు కూడా టైంకి చేరుకునేందుకు మెట్రో రైల్ ఎక్కుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ముంబై మెట్రోలో ప్రయాణించారు.

మెట్రోలో అక్షయ్ కుమార్ ను చూసిన ఆయన అభిమానులు షాక్ అయ్యారు. పలువురు ఆయనతో ఫోటో దిగేందుకు ఎగబడ్డారు.ప్రముఖ నిర్మాత దినేష్‌ విజన్‌తో కలిసి అక్షయ్‌ రైలులో ప్రయాణించాడు. బ్లాక్‌ డ్రస్‌ ధరించి, మ్యాచింగ్‌ టోపీతో మెట్రోలో ప్రజలకు దర్శనమిచ్చాడు. ఎవరూ గుర్తు పట్టని విధంగా ముఖానికి వైట్‌ మాస్క్‌ పెట్టుకుని కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు.. ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Ads

did you recognize this star hero
అక్షయ్‌ కుమార్‌ ప్రస్తుతం టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి బడే మియా చోటే మియా చిత్రంలో నటిస్తున్నారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈద్‌ సందర్భంగా ఏప్రిల్‌ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

మరోవైపు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో వస్తున్న సింగం అగైన్‌ చిత్రంలోనూ అక్షయ్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, టైగ‌ర్ ష్రాఫ్, రణ్‌వీర్‌ సింగ్‌, జాకీ ష్రాఫ్‌, అర్జున్‌ కపూర్‌, కరీనా కపూర్‌ లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉన్నారు. అక్షయ లాంటి స్టార్ హీరో మెట్రోలో ప్రయాణించటం ఆయన అభిమానులను ఆనందపరుస్తుంది.

Previous articleనటి నళిని జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా..? విడాకుల తర్వాత..?
Next articleనాగార్జున సినిమాల్లోకి వచ్చే ముందు.. అభిమానులకు ఏఎన్నార్ ఓ లేఖ రాసారు… ఏమనో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.