పుట్టిన రోజు నాడే చనిపోయిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ మీకు గుర్తు ఉందా..?

Ads

భగవంతుడు ఎందుకు కొంతమందిని త్వరగా తన దగ్గరికి తీసుకువెళ్ళిపోతాడో అర్థం కాదు.. పుట్టినరోజు నాడే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ చనిపోయింది. ఎంతో అందంగా చలాకీగా నటనతో అందరినీ ఆకట్టుకునే ఈ చిన్నారి చాలా చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. నిజానికి మనిషి యొక్క జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు. అంతా బాగుందనుకునేసరికి సడన్ గా ఏదో ఒకటి జరగొచ్చు.

ఒక్క క్షణంలో ఆనందమంతా తారుమరైపోతుంది. సామాన్య ప్రజలు అయినా, సెలబ్రిటీలు లేదంటే రాజకీయ నాయకులు అయినా చనిపోయాక వాళ్ళు చేసిన మంచి పనులు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. బాలనటి అయినటువంటి తరుణి సచ్ దేవ్ కూడా అందరికీ గుర్తు ఉండిపోయింది. 15 ఏళ్ల వయసులోనే ఈమె విమాన ప్రమాదంలో చనిపోయింది. ఆమె ఏకంగా 50 కి పైగా ప్రకటనలు చేసింది.

సినిమాల్లో కూడా నటించింది. ఇక ఆమె వివరాలను చూస్తే.. 1998 మే 14న జన్మించింది తరుణి ఆమె పుట్టినరోజు నాడే ఆమె చనిపోయింది. మే 14 2012లో విమాన ప్రమాదంలో మరణించింది. తరుణీ తన తల్లితో పాటు విహారయాత్ర కోసం నేపాల్ కి వెళ్లాలని ప్రయాణం అయ్యింది. ఆ ముందు స్నేహితులకి వీడ్కోలు చెప్పడానికి ఆమె కలుసుకుంది.

Ads

వాళ్లకి ఒక హగ్ ఇచ్చి నేను మిమ్మల్ని చివరిసారిగా కలుస్తున్నానని చెప్పింది. అయితే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆమె తన స్నేహితులతో ఈ విధంగా చెప్పలేదట మొట్టమొదటిసారి ఆమె అలా చెప్పింది. పైగా ఆమె ఫ్లైట్ ఎక్కే ముందు తన ఫ్రెండ్ కి విమానం కూలిపోతే ఏమవుతుంది అని మెసేజ్ కూడా పంపింది.. అలానే ఐ లవ్ యు అని కూడా ఆమె పంపింది.

పాపం ఆ ప్రయాణంలో ఆమె మరణించింది. ఆకస్మాత్తుగా ప్రమాదానికి గురవడం వలన తరుణీ ప్రాణాలని వదిలేసింది. ఈమె ఒక సినిమాలో అమితాబ్ స్నేహితురాలుగా నటించింది. కరిష్మా కపూర్ తో రస్నా యాడ్ ని కూడా ఈమె నటించింది. హీరోయిన్ గా రావాలని తరుణీ కోరుకుంది. కానీ చిన్నతనంలోనే ఆమె తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది. అందరినీ ఈ వార్త కృంగిపోయేలా చేసింది. సినీ ప్రముఖులు అభిమానులు ఎంతగానో విచారించారు.

Previous articleపెళ్లయిన ఏడాదికే భర్త మరణించడంతో పుట్టింటికి వెళ్ళిపోయింది…52 ఏళ్ల తర్వాత ఏమైందంటే.?
Next articleఏడాదిన్నర కాలంలో 37 మంది మృతి..హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలకు కారణం ఇదేనా.?