వైయస్ షర్మిల లో ఈ మార్పు గమనించారా..? అంటే విభేదాలు నిజమేనా..?

Ads

వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక నిన్న సాయంత్రం హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ లో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి షర్మిల సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతి తో కలిసి హాజరయ్యారు.

అయితే ఈ వేడుక సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి షర్మిలా కి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. షర్మిల కి జగన్ కి మధ్య ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆస్తి విషయంలో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే షర్మిల జగన్ తో విడిపోయి తెలంగాణలో పార్టీ పెట్టుకోవడం… తర్వాతిపార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అవడం వరకు అన్నీ తెలిసిందే. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరడం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారే అంశం.

ys sharmila son

Ads

జరిగేది సొంత మేనల్లుడి నిశ్చితార్థ వేడుకో కాబట్టి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో షర్మిల జగన్ అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. ప్రారంభంలో పలకరించుకున్నప్పటికీ కూడా స్టేజి మీద ఫోటోలు దిగే సమయంలో దూరంగా జరిగారు. షర్మిల భర్త కూడా ఇదే తీరులో ఉన్నారు. ఫోటో దిగేటప్పుడు జగన్ షర్మిలాని రెండుసార్లు పిలిచిన దగ్గరికి రాలేదు.

ys sharmila son

మూడోసారి విజయమ్మ దగ్గరికి వచ్చి ఫోటో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ వేడుకైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంక అక్కడ నుండి నేరుగా తాడేపల్లి బయలుదేరి వెళ్లిపోయారు.జగన్ వెంట వైసీపీ నాయకులు సజ్జలు రామకృష్ణా రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ రాజకీయ ప్రముఖులు ఈ నిశ్చితార్థ వేడుకకి హాజరయ్యి నూతన జంటను ఆశీర్వదించారు.

Previous articleమేనల్లుడి నిశ్చితార్థానికి హాజరు అయిన వైస్ జగన్..! వేడుకలో హైలైట్స్ ఇవే..!
Next articleమూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ప్లాప్ టాక్ తెచ్చుకొని, ఆ తరువాత హిట్ అయిన 8 చిత్రాలు ఇవే..