సింబా టీం ఆఫర్ ఇదే.. డైరెక్టర్ ఎమోషనల్ స్పీచ్

Ads

సంపత్ నంది కథతో మురళీ మనోహర్ దర్శకత్వంలో అనసూయ, జగపతిబాబు వంటి వారు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింబా. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే అనసూయ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ఎంపి సంతోష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ఇప్పటివరకు ఎవరు ఇవ్వని ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు వారి స్వార్థం కోసం చెట్లను విపరీతంగా నరికేస్తున్నారు.

Ads

ఇలా చెట్లను నరకడం వల్ల ఎన్నో రకాల సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము ఇలా చెట్టు నరికిన వారు దాని స్థానంలో మరో మొక్కను నాటడం మర్చిపోతున్నారు. తద్వారా ప్రకృతి ఆగ్రహానికి మనం గురి అవుతున్నాము. ఇటీవల కేరళ వయనాడ్ లో ప్రకృతి విలయతాండవం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్తులు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని రక్షించుకోవాలని వెల్లడించారు.

ఇలా పర్యావరణాన్ని రక్షించడంలో మొక్కలు కీలక ప్రాధాన్యత పోసిస్తాయి కనుక పర్యావరణాన్ని కాపాడే విషయంలో ఎవరైతే మొక్కలు నాటి తమకు మెసేజ్ చేస్తారో అలాంటి వారికి ఈ సినిమా టికెట్ ఫ్రీగా ఇస్తానని నటుడు శ్రీనాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా మొక్కలు నాటితే ఈ సినిమా టికెట్ అందుకోవచ్చాని ఈయన వెల్లడించడంతో ఈయన ఇచ్చిన బంపర్ ఆఫర్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది.

Previous article24 ఏళ్ళ వయసులో సీనియర్ ఎన్టీఆర్, జగ్గయ్య గారికి రాసిన ఈ లెటర్ చూశారా..? ఇందులో ఏం రాశారు అంటే..?
Next articleSIMBAA REVIEW: అనసూయ సింబా మూవీ రివ్యూ అండ్ రేటింగ్?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.