అయోధ్య రామ మందిరానికి చీపురు కానుక ఇచ్చిన ఈయన ఎవరో తెలుసా.? ప్రత్యేకత ఏంటంటే.?

Ads

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగిన బాలా రాముడి మందిరానికి భక్తుల తాకిడి రోజురోజుకి పెరుగుతుంది. బాల రాముడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు.విపరీతమైన చలి ఉన్న లెక్క చెయ్యకుండా ఆలయానికి వస్తున్నారు.ప్రతి రోజూ రెండు లక్షలమందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటోన్నారు.

ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు అయోధ్య రామాలయంలో స్వామి వారి దర్శనాలు ప్రారంభం అయ్యి 11:30 గంటలకు ముగుస్తున్నాయి. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శన కాలం ఉంటుంది. ప్రతి రోజు తెల్లవారు జామున 6:30 గంటలకు జాగరణ్ హారతి ఇస్తారు.ఇక మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, సాయంత్రం 7: 30 గంటలకు సంధ్యా హారతితో ఆలయ తలుపులను మూసివేస్తారు.

Ads

ఇక దేశం నలుమూలన నుండి స్వామివారికి భారీ ఎత్తున కానుకలు వస్తున్నాయి. నగదు రూపంలో వస్తువుల రూపంలో వెండి బంగారు కానుకలు అందుతున్నాయి.తాజాగా- అఖిల భారతీయ మాంగ్ సమాజ్ భక్తులు రామ మందిరానికి చీపురును కానుకగా సమర్పించారు. వెండితో తయారు చేసిన ఈ చీపురును 1.751 కేజీల వెండితో తయారు చేశారు.ప్రదర్శనగా ఈ వెండి చీపురును అయోధ్యకు తీసుకొచ్చి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అందజేశారు. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం వేళల్లో బాల రాముడి గర్భాలయాన్ని ఈ వెండి చీపురుతో శుభ్రం చేయాలని కోరారు.

Previous articleచికెన్‌ను ట్యాప్ కింద కడుగుతున్నారా? అలా కడగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
Next article“రవితేజ చేసిన పనికి హీరోయిన్ల విషయంలో ఇబ్బంది పడుతున్నాము”… తేజ ఫన్నీ కామెంట్స్.!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.