మేనల్లుడి నిశ్చితార్థానికి హాజరు అయిన వైస్ జగన్..! వేడుకలో హైలైట్స్ ఇవే..!

Ads

వైయస్ షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి ప్రియ అట్లూరీల నిశ్చితార్థ వేడుక హైదరాబాదులో నిన్న సాయంత్రం గండిపేట లో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో రాజారెడ్డి ప్రియ అట్లూరీలు ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థ వేడుకను ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతి దంపతులు హాజరై మేనల్లుడు రాజారెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో షర్మిల భర్త అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని దగ్గరుండి ఆహ్వానించారు అనంతరం వధూవరులను ఆశీర్వదించి వారితో కలిసి ఫోటోలు దిగారు.

ys sharmila son

Ads

ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మతో ఆప్యాయంగా మాట్లాడిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. రాజకీయాల్లో విభేదాలు ఉన్న చెల్లెలు షర్మిల తో కూడా జగన్మోహన్ రెడ్డి కాసేపు ముచ్చటించారు. అయితే వీరిద్దరి కలయిక రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. అనంతరం జగన్మోహన్ రెడ్డి వేడుక అయిన తర్వాత హైదరాబాద్ నుండి తాడేపల్లికి తిరిగి పయనమయ్యారు.వీరితో పాటు ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ys sharmila son

ఈ సందర్భంగా షర్మిల పవన్ కళ్యాణ్ ఒకరినొకరు పలకరించుకొని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు రావడంతో ఇది సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలబడింది. అయితే తన కుమారుడి వివాహాన్ని ఫిబ్రవరి 17 తారీకున జరిపించనున్నట్లు షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే వేడుకకు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులకు అందరికీ ఆహ్వానాన్ని అందించారు. మా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా షర్మిల ఆహ్వాన పత్రికలు అందించారు. పలువురు సినీ ప్రముఖులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది.

Previous article500 నోటు మీద గాంధీ స్థానంలో శ్రీరాముడు..! ఈ నోట్లని ఎప్పుడు విడుదల చేస్తారు..?
Next articleవైయస్ షర్మిల లో ఈ మార్పు గమనించారా..? అంటే విభేదాలు నిజమేనా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.