”ముగ్గురు మొన‌గాళ్లు” సినిమాలో చిరంజీవికి డూప్ గా నటించిన వాళ్లెవరో మీకు తెలుసా..?

Ads

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాలు కి పైగా నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్నారు. చిరంజీవి కాస్త గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చారు. రియంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. మెగాస్టార్ ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు కూడా ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ముగ్గురు మొనగాళ్లు సినిమా మీకు గుర్తుండే ఉంటుంది.

నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని తీసుకువచ్చారు. రాఘవేంద్ర రావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాలో మూడు పాత్రలు చేసి చిరంజీవి అందరిని కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు. మొత్తం మూడు పాత్రలు సినిమాలో చేయాలి. ఒక పాత్ర పోలీస్ పాత్ర, ఇంకో పాత్ర పృథ్వి, మరొక పాత్ర దత్తాత్రేయ పాత్ర. ఇలా మూడు పాత్రల్లో చిరు కనబడాల్సి ఉంది. మూడు పాత్రలు కాబట్టి రెండు డూపులు కావాల్సి ఉంది. అలానే మూడు పాత్రలకి కూడా మూడు రకాలుగా గొంతులు మార్చి డబ్బింగ్ చెప్పారు.

Ads

చిరంజీవికి డూప్ కింద మరి ఎవరు నటించారు అనే విషయానికి వస్తే… చిరంజీవి దగ్గర పనిచేస్తున్న ఆయన పిఏ సుబ్బారావు ఒక పాత్ర చేయగా నటుడు ప్రసాద్ రావు ఇంకో చిరంజీవి పాత్ర చేశారు. వారిద్దరు బరువు ఎత్తు కూడా చిరంజీవికి దగ్గరగా ఉండడంతో సెట్ అయ్యారు.

కేవలం ఈ ఒక్క సినిమాయే కాదు చిరంజీవికి డూప్ గా వీళ్ళిద్దరూ మరికొన్ని చిత్రాలు కూడా చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతికి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా మంచి హిట్ ని అందుకుంది. ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ సినిమాలో నటించనున్నారు.

Previous article“ఈ హీరో అర్జునుడి పాత్రకి సెట్ అవుతారా..?” అంటూ… కల్కి 2898 మీద కామెంట్స్..! ఎవరంటే..?
Next articleఓటీటీలో దూసుకెళ్తున్న ఈ సినిమా చూసారా.? ఏకంగా 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అంట.?