స్టేజి మీదే గుండు గీయించుకున్న “బులెట్ భాస్కర్”…కామెంట్ ఇచ్చే ఫ్రీడమ్ కూడా లేదా అంటూ “ఖుష్బూ” ఫైర్.!

తెలుగులో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి మనందరికీ తెలిసిందే. జబర్దస్త్ షో ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. కొన్ని ఏళ్ల నుంచి సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే జబర్దస్త్ షోలో స్కిట్ల కోసం తిట్టుకోవడం ఒకరిపై ఒకరు ఫైర్ కావడం అన్నది మామూలుగా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రోమో కోసం కూడా కొట్లాడుకున్నట్లు స్టేజ్ నుంచి వెళ్ళిపోతున్నట్లు చేస్తూ ఉంటారు. కానీ తాజాగా మాత్రం ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది. జబర్దస్త్ టీం లీడర్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ గుండు గీయించుకోవడం ప్రస్తుత షాకింగ్ గా మారింది.

image credits: mallemalatv

దాంతో జడ్జ్ కుష్బూ షో నుంచి వెళ్లిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. అసలేం జరిగిందంటే.. బుల్లెట్‌ భాస్కర్‌ తన టీమ్‌తో కలిసి నిజం సినిమా స్కిట్‌ని ప్రదర్శించారు. ఇందులో గోపీచంద్‌ గా బుల్లెట్‌ భాస్కర్‌, మహేష్‌గా నరేష్‌, మదర్‌ రోల్‌లో ఫైమా చేశారు. నరేష్‌.. మహేష్‌ పాత్రలో ఇది చేయి, ఇది పిడికిలి అని మహేష్‌ స్టైల్ లో చెప్పగా, మొత్తం కలిసి నా వేలంతా లేదు కదరా అని భాస్కర్‌ చెప్పడంతో నవ్వులు పూయించాయి. ఇక గోపీచంద్‌ పాత్రలో బుల్లెట్‌ భాస్కర్‌ చెబుతూ పెద్దమ్మ తల్లికి అమ్మోరు తల్లిని బలియండ్రా అని చెప్పాడు.

image credits: mallemalatv

దీనికి జడ్జ్ కృష్ణభగవాన్‌ అభ్యంతరం తెలిపారు. సినిమాలో గోపీచంద్‌ పెద్దమ్మ తల్లి వద్దకు వెళ్లినప్పుడు ఆయనకు గుండు ఉంటుంది కదా, అని ప్రశ్నించాడు. దాంతో భాస్కర్‌ రియాక్ట్ అవుతూ, ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి సర్‌, మధ్యలో అంటే కష్టమవుతుందన్నాడు.

దీనికి ఖుష్బూ రియాక్ట్ అయ్యింది. స్ఫూప్‌ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉండాలి కదా అని, ఫీల్‌ అవ్వడానికి ఏం లేదు కదా అని ఆమె ప్రశ్నించింది. దీంతో భాస్కర్ కి దిమ్మతిరిగిపోయింది. దీనికి రియాక్ట్ అయిన భాస్కర్‌ తాను స్కిట్‌ కోసం ప్రాణమిస్తా, అలాంటిది జుట్టు పెద్ద సమస్య కాదన్నాడు. అంతేకాదు మీరు గుండు అన్నారు కాబట్టి 100 శాతం గుండులోనే చూపిస్తా అంటూ జబర్దస్త్ షోలోనే ఆయన గుండు గీయించుకోవడం అందరికి షాకిచ్చింది.

image credits: mallemalatv

షో స్టేజ్‌ మీదే, స్కిట్‌లోనే ఆయన తన గుండు గీయించుకున్నాడు. నిజం సినిమాలో గోపీచంద్‌లా మారిపోయాడు. దీంతో అటు కృష్ణభగవాన్, ఖుష్బూ, ఇటు యాంకర్ రష్మి, ఇతర కమెడియన్లంతా షాక్‌లోకి వెళ్లిపోయారు. ఖుష్బూకి ఏం రియాక్ట్ కావాలో కూడా తెలియలేదు. అలాంటి పరిస్తితుల్లో భాస్కర్‌ గుండులో చూపించి స్కిట్‌ చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఓకేనా సర్‌ అంటూ భాస్కర్‌ అడిగాడు, దీనికి కృష్ణభగవాన్‌ రియాక్ట్ అవుతూ, ఆ ఎఫెక్ట్ కావాలన్నాం గానీ, నిజంగానే గుండు గీయించుకుంటే ఎలా అన్నాడు. అది మీరు గుండు గీయించుకోవడానికి ముందు చెప్పాలి. అంతా అయిపోయాక పోయిన బొచ్చు వెనక్కి వస్తుందా అని ఘాటుగా రియాక్ట్ అయ్యాడు భాస్కర్‌.

image credits: mallemalatv

దీనిపై జడ్జ్ ఖుష్బూ ఫైర్‌ అయ్యింది. మనకు ఒక రెస్పాన్సిబులిటీ ఇచ్చారు. అందుకే ఈ సీట్‌ మీద ఉన్నాం. అలా ఉన్నప్పుడు ఒక కామెంట్‌ కూడా ఇవ్వడానికి ఫ్రీడమ్‌ లేదంటే అని ఆమె చెప్పబోతుండగా, భాస్కర్‌ కల్పించుకోబోయాడు. దీనికి ఖుష్బూ మరింత స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యింది. నేను నీతో మాట్లాడటం లేదని కౌంటర్‌ ఇచ్చింది. ఒక జడ్జ్ గా ఒక ప్రశ్న అడగడానికి నాకు రైట్స్ లేదంటే మరి నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అంటూ ఖుష్బూ, కృష్ణభగవాన్‌ తమ సీట్ల నుంచి లేచి వెళ్లిపోయారు. దీనికి భాస్కర్‌ కూడా థ్యాంక్యూ మేడం అంటూ స్టేజ్‌ నుంచి వెళ్లిపోవడంతో షో మొత్తం హీటెక్కిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

watch video:

Previous articleటీమిండియా ఓటమికి బీజేపీకి సంబంధం ఏంటి.. 2014 నుంచి అంతే అంటూ?
Next article“మంగళవారం”లో జమీందారు భార్యగా నటించిన ఈమె ఎవరో తెలుసా.? బ్యాగ్రౌండ్ ఏంటంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.