భార్య మైనపు బొమ్మతో గృహప్రవేశం చేసిన క‌ర్నాట‌క వ్యాపారవేత్త..

Ads

శ్రీరామచంద్రుడు ఆనాడు రాజసూయ యాగం కోసం సీతమ్మ స్వర్ణ ప్రతిమను తయారు చేయించాడని రామాయణంలో చూసాము. అయితే ఒక వ్యక్తి తన గృహ ప్రవేశం కోసం చనిపోయిన భార్య మైనపు ప్రతిమను తయారు చేయించి కలియుగ శ్రీరాముడు అని అనిపించుకుంటున్నాడు.

Ads

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూసినవారు పై విధంగా కామెంట్స్ చేస్తున్నారు. భార్యలు బ్రతికి ఉండగానే నరకం చూపించే భర్తలు ఉన్న ఈ సొసైటీలో ఇటువంటి వ్యక్తులు ఉండటం గొప్ప విషయమే. మరి భార్యను అంతగా ప్రేమించిన ఆ భర్త ఎవరో? ఎక్కడో ఇప్పుడు చూద్దాం..శ్రీనివాస్ గుప్తా క‌ర్నాట‌క రాష్ట్రంలోని కొప్పాల్ కు చెందినటు వంటి బిజినెస్ మెన్ మరియు రాజ‌కీయ నాయ‌కుడు. మధ్యత‌ర‌గ‌తికి చెందిన శ్రీనివాస్ కు వెంక‌ట నాగ మాధ‌వి అనే మహిళను పెళ్లి చేసుకున్నప్పటి నుండి అత‌ని జీవితం మారింది. అతను పట్టుకున్నదల్లా బంగారమైంది. అతను తన భార్య ఇచ్చే స‌ల‌హాల‌ను పాటిస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. ఇక శ్రీనివాస్ గుప్తాకు భార్య మాధ‌వి అంటే చాలా ప్రేమ‌. ఈ దంపతులకు ఇద్ద‌రు కుమార్తెలు. ఆయన భార్య మాధవికి వారికంటూ ఒక మంచి గృహం ఉండాలనే కల ఉండేది. ఈ విషయం భ‌ర్త‌ శ్రీనివాస్ కు చెప్పగా, అందుకు సరే అని ఇంటి కోసం ప్లాన్ గీయించారు.
అయితే ఇంటి నిర్మాణం ఎలా ఉండాలనే అన్ని విషయాలు ఆమె చూసుకుంది. ఈ క్రమంలో 2017లో తిరుప‌తికి వెళ్ళి, తిరిగి వచ్చేప్పుడు యాక్సిడెంట్ జ‌రిగి మాధ‌వి కన్నుమూసింది. ఇక ఆరోజు నుండి శ్రీనివాస్ భార్య జ్ఞాప‌కాల్లోనే జీవిస్తున్నారు. ఆమె కోరిక ప్రకారం ఇంటిని పూర్తి చేసి, గృహ‌ప్ర‌వేశంలో తన పక్కన భార్య ఉండాలనే కోరికతో భార్య మైన‌పు బొమ్మ‌ను త‌యారు చేయించాడు. జీవం ఉట్టిప‌డేలా ఉంది. దూరం నుండి చూస్తే చిరునవ్వుతో ఉన్న మనిషిలాగానే ఉంది.అలా ఆమె మైనపు బొమ్మతో శ్రీనివాస్ గుప్తా గృహ‌ప్ర‌వేశం చేశారు.

Also Read: మెహందీ ఫంక్షన్ ప్రాముఖ్యత ఏమిటి…? పెళ్లికి ముందు ఎందుకు చెయ్యాలి..?

Previous articleవిక్రమార్కుడు మూవీలోని ఆ సన్నివేశాన్ని జక్కన కాపీ చేసారా? (Video)
Next articleపరోటాలు తినడం ఎంత హానికరమో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.