“మంగళవారం”లో హీరోయిన్ కంటే ఎక్కువగా ఈమె ట్రెండ్ అవుతుందిగా.? ఇంతకీ ఎవరు ఈమె.?

Ads

ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మంగళవారం. ఈ మూవీ తాజాగా OTT లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ పెర్ఫామెన్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి పాయల్‌ తో పాటు ఇంకో హీరోయిన్ గురించి కూడా నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఎవరా అని నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ఎక్స్ 100’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిదో అందరికీ తెలిసిందే. ఆ మూవీ తరువాత వీరిద్దరూ ఆ రేంజ్ లో హిట్ అందుకోలేదు. మళ్లీ వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘మంగళవారం’ మూవీ కి హిట్ టాక్ వచ్చింది. ఈ మూవీలో ఇతర హీరోయిన్లు ఈజీగా ఒప్పుకోని పాత్రలో పాయల్‌ రాజ్‌పుత్‌ నటించింది. ఆమె పెర్ఫామెన్స్ తో ప్రశంసలు కూడా అందుకుంటోంది.

Ads

ఈ సినిమాలో కొందరు నటినటులు మంచి నటనను కనబరిచారు. అయితే వారిలో మూవీలో చివర్లో హైలైట్ గా నిలిచింది మాత్రం జమీందారు భార్యగా నటించిన నటి. క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్టు ఇచ్చిన  ఆ నటి ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆ నటి పేరు దివ్యా పిళ్లై, మలయాళ నటి. ఆమె మలయాళంలో అనేక సినిమాలలో నటించింది. ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచిన టొవినో థామస్ ‘కలా’ మూవీలో హీరో భార్యగా నటించింది.
తమిళంలో ఒక సినిమాలో, వెబ్ సీరీస్ లో నటించింది. తెలుగులో దివ్యకు మంగళవారం మొదటి సినిమా కాదు. దండుపాళ్యం దర్శకుడు తెరకెక్కించిన ‘తగ్గేదేలే’ మూవీలో నవీన్ చంద్ర పక్కన హీరోయిన్ గా నటించింది. అయితే ఆ మూవీ హిట్ కాకపోవడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. ఆమె ప్రతిభను గుర్తించి అజయ్ భూపతి ‘ఈ మూవీలో అవకాశం ఇచ్చాడు. జమీందారు భార్యగా దివ్య తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది.

Also Read: ఇదేందయ్యా ఇది…భార్యాభర్తలు కలవడానికి కూడా “షెడ్యూల్” పెట్టుకుంటారు అంట.?

Previous articleఈ సినిమాలో హీరోయిన్ హీరో కన్నా పెద్దది.. ఆ ఒక్క హీరోయిన్ తో మాత్రమే ఎన్టీఆర్ అలా చేసారు.!
Next articleఓటీటీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా చూసారా.? సస్పెన్స్ కామెడీ మాములుగా లేదుగా.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.