భద్రినాథ్ మూవీలో నటించిన లేడీ విలన్ అశ్విని కల్సేకర్ భర్త ఎవరో తెలుసా?

Ads

సినీ పరిశ్రమలో ఉండే చాలా మంది సెలబ్రిటీల మధ్య స్నేహాలు, బంధుత్వాలు ఉంటాయి. అలాగే వీరిలో చాలామంది భార్యాభర్తలు ఉన్నారు. అయితే ఆ విషయం చాలా వరకు ఆడియెన్స్ కి తెలియదు.

Ads

దాంతో ఎప్పుడైనా ఎక్కడైనా ఫలానా నటుడి భార్య కూడా నటి అని, అలాగే బాగా తెలిసిన నటి భర్త కూడా నటుడే అని తెలిసినపుడు ఆడియెన్స్ ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే భద్రీనాథ్ మూవీలో లేడీ విలన్ గా చేసిన నటి భర్త కూడా టాలీవుడ్ లో ప్రముఖ నటుడే. ఆడియెన్స్ కి బాగా సూపరిచితుడే. మరి ఆమె భర్త ఎవరో చూద్దాం..వివి.వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్, తమన్నా జంటగా నటించిన సినిమా భద్రీనాథ్. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తీశారు. ఈ సినిమాలో లేడీ విలన్ క్యారెక్టర్ ఆడియెన్స్ ని చాలా ఆకట్టుకుంది. హీరోయిన్ తమన్నాకు అత్తగా పాత్రలో నటించిన ఆ లేడి విలన్ పేరు ‘అశ్విని కల్సేకర్. ఈ సినిమాలో తన యాక్టింగ్ తో ఆడియెన్స్ ని భయపెట్టిందని చెప్పాలి.ఆమె టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ చిత్రాలలో ఎక్కువగా నటించారు. ఆమె హిందీ, మరాఠీ సీరియల్స్ లో నటించి అక్కడా అభిమానులను ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం అశ్విని హాట్ స్టార్, జీ 5 వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అశ్విని కల్సేకర్ భర్త మరెవరో కాదు టాలీవుడ్ లో ప్రముఖ నటుడు అయిన మురళి శర్మ. ఆయన తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా నటించారు. మొదట బాలీవుడ్ లో కెరీర్ ను మొదలుపెట్టిన మురళి శర్మ తెలుగులో మహేష్ బాబు ‘అతిథి’ మూవీలో నటించారు. అప్పటి నుండి తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ, పాత్ర ఏదైనా ఒదిగిపోయే నటుడు మురళి శర్మ. మురళీ శర్మ, అశ్వినిని 2002లో వివాహం చేసుకున్నారు. కానీ అశ్వినికి ఇది రెండవ వివాహం. ఆమెకు 1998లో నితీష్ పాండేతో వివాహం కాగా, 2002లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది మురళీ శర్మను అశ్విని రెండో వివాహం చేసుకున్నారు.

Also Read: కొరటాల శివ డైరెక్షన్ చేసిన ఈ 4 సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటో తెలుసా?

Previous articleకమెడియన్ భరత్ గురించిన ఈ షాకింగ్ విషయాలు తెలుసా?
Next articleగాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం అరుదైన ఫోటో గ్యాలరీ..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.