Ads
గత కొంత కాలం నుండి సినిమాలతో పాటు సమానంగా వెబ్ సిరీస్ కి కూడా అభిమానులు పెరిగారు. దాంతో పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇటీవల అలాంటి ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఎంతో భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందించారు. దీని గురించి ఇది విడుదల అయినప్పటి నుండి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ సిరీస్ పేరు హీరా మండి- ది డైమండ్ బజార్. ప్రముఖ నటి మనిషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, సంజీదా షేక్, రిచా చద్దా, షర్మిన్ సెగల్ ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు.
Ads
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దీన్ని రూపొందించారు. 1920 ప్రాంతంలో పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ లో ఈ కథ జరుగుతుంది. హీరా మండి అనే ఒక ప్రాంతంలో నివసించే వారి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మల్లికా జాన్ (మనీషా కోయిరాలా), ఆమె దత్తత తీసుకున్న లజ్జో (రిచా చద్దా), మల్లిక సోదరి అయిన వహిదా (సంజీదా షేక్) , మల్లికా పెద్ద కూతురు అయిన బిబ్బో జాన్ (అదితి రావు హైదరి), మల్లిక చిన్న కూతురు ఆలమ్ (షర్మిన్ సెగల్) ముఖ్య పాత్రధారులు.
మల్లిక మీద పగ తీర్చుకోవడానికి ఫరీదా (సోనాక్షి సిన్హా) వస్తుంది. అసలు వాళ్ళందరూ ఎవరు అనేది కథ. సాధారణంగా సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు అంటే చాలా స్లోగా నడుస్తాయి అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ సిరీస్ కూడా అలాగే నడుస్తుంది. 8 ఎపిసోడ్లు గా విడుదల అయిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో దీన్ని రూపొందించారు. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. లైటింగ్, సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్, పాటలు ఇవన్నీ కూడా ఎంతో బాగా ఉండేలాగా చూసుకున్నారు. ఈ సిరీస్ కి రెండవ భాగం ఉంటుంది అని కూడా ఇటీవల ప్రకటించారు.