భారీగా రెమ్యూనరేషన్ పెంచిన అడివి శేష్..

Ads

టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ వరుసగా హిట్స్ ఇస్తూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల వచ్చిన హిట్ 2 సెకండ్ కేస్ తో ఇంకో హిట్ కొట్టాడు అడివి శేష్. హీరో నాని వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌ పై నిర్మించిన ఈ సినిమాకి శైలేష్ కొలను డైరెక్షన్ చేసాడు. డిసెంబ‌ర్ 2న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద విజ‌యం సాధించింది.

Ads

అడివి శేష్ కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్ లలో కనిపించాడు. ఆ తరువాత అమెరికా వెళ్ళి తిరిగి వచ్చి, కర్మ అనే సొంత సినిమా తీశాడు. తరువాత పంజా, బాహుబలి మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ తరువాత కిస్ మూవీతో హీరోగా మారాడు. క్షణం సినిమాతో హీరోని మొదటి విజయాన్ని ఖాతాలో చేర్చుకున్నాడు.అడివి శేష్ హీరోగానే కాకుండా స్టోరీ కూడా ఆయనే రాస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇక క్షణం మూవీతో స్టార్ట్ అయిన శేష్ సక్సెస్ హిట్ 2 వరకు కొనసాగింది. శేష్ డబుల్ హ్యాట్రిక్స్ తో ముందుకెళ్తున్నాడు. శేష్ గూఢచారి, అమీ తుమీ, క్షణం, ఎవరు, మేజర్, హిట్ 2 సినిమాలతో హ్యాట్రిక్ హీరోల సరసన చేరారు. ప్రస్తుతం అడివి శేష్ మినిమం గ్యారంటీ హీరోగా మారడంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక హిట్ 2 విజయం తరువాత శేష్ రెమ్యూనరేషన్ పెంచినట్టుగా తెలుస్తోంది.అడివి శేష్ విజయం పొందిన ప్రతిసారి ఆయన గ్రాఫ్ తో, పారితోషికం కూడా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అడివి శేష్ రెమ్యూనరేషన్ పై రకరకాలుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంత‌కు ముందుకు అడివి శేష్ ఒక మూవీకి రూ.5 కోట్లలో పారితోషకం తీసుకునేవాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎనిమిది నుండి పడి కోట్ల వరకు పారితోషికం కావాలని డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. అడివి శేష్ కి ఉన్న క్రేజ్ మరియు మార్కెట్ ని బట్టి నిర్మాత‌లు కూడా ఆయన అడిగినంత ఇచ్చేందుకు వెన‌క‌డడం లేదని వినిపిస్తోంది.

Also read: రజినీకాంత్ ని బిచ్చగాడు అనుకుని మహిళ భిక్షం వేసిన వేళ..

Previous articleరాజమౌళికి పోటీ ఇచ్చే ఈ 5 మంది డైరెక్టర్లు ఎవరో తెలుసా?
Next articleమెగాస్టార్ టు వైష్ణవ్ తేజ్.. హిట్ కోసం వెయిట్ చేస్తున్న 10 టాలీవుడ్ హీరోలు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.