నాకౌట్ మ్యాచ్ లో అందరికంటే ఎక్కువ ఫ్లాప్ అయింది “సూర్య” కాదు.. ఈ ఆల్ రౌండర్..!

Ads

వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ కోసం టీమిండియా కన్న కలలు కల్లలు అయ్యాయి. ఆస్ట్రేలియా ఫైనల్ లో భారత్ ను ఓడించి వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే ప్రపంచ కప్ ఫైనల్ లో ఓటమి తరువాత భారత ఆటగాళ్లు నిరాశ‌లో కూరుకుపోయారు. ప్రపంచకప్ ఫైనల్ అనంతరం సోషల్ మీడియాలో సూర్యకుమార్ యాదవ్ ను ట్రోల్ చేశారు. అయితే అందరి కన్నా ఫైనల్ మ్యాచ్ లో నిరాశ పరిచింది ఈ ఆల్ రౌండర్ అని కామెంట్స్ చేస్తున్నారు. అతనేవరో ఇప్పుడు చూద్దాం..
వరల్డ్ కప్ 2023 ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ నుండి సెమీఫైనల్ వరకు ఆడిన పది మ్యాచ్‌ లలో గెలిచిన టీమిండియా, ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. మొదటి నుండి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో స్ట్రాంగ్ గా ఉన్నభారత జట్టు అపజయం ఊహించని పరిణామం. అంతవరకూ సూపర్ గా ఆడిన జట్టు ఒక్కసారి ఎందుకు బోల్తా పడిందనే విషయం పై చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఫైనల్ మ్యాచ్ లో సరిగ్గా ఆడలేదంటూ సోషల్ మీడియాలో  ట్రోల్ చేశారు. కానీ లీగ్ మ్యాచ్‌లలో చాలా బాగా ఆడి, ఫైనల్ మ్యాచ్ లో అందరికన్నా ఎక్కువ ఫ్లాప్ అయింది జడేజానే. సెమీ ఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్ లో జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేదు. అదే
లీగ్ దశలో 16 వికెట్లు తీశాడు.
నాకౌట్ మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో జడేజా రెండింట్లో ఫెయిల్ అయ్యాడు. అయితే రవీంద్ర జడేజా ఐపీఎల్ లో అయితే వేరేలా ఆడి ఉండేవాడు. ఐపీఎల్ 2023 లో అదిరిపోయే ఆటతో సీఎస్‌కేకి మ్యాచ్‌ ని గెలిచేలా చేశాడు. అప్పటి వరకు ఒడిపోతుందని అనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జడేజా ఇన్నింగ్స్ వల్ల ఐదోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది.

Ads

Also Read: వరల్డ్ కప్‌ ఫైనల్‌లో “రోహిత్‌ శర్మ” తీసుకున్న ఆ నిర్ణయమే కొంపముంచిందా..?

Previous articleస్టేజి మీదే గుండు గీయించుకున్న “బులెట్ భాస్కర్”…కామెంట్ ఇచ్చే ఫ్రీడమ్ కూడా లేదా అంటూ “ఖుష్బూ” ఫైర్.!
Next articleసౌత్ ఇండియాలోనే అందరికంటే రిచ్ హీరో ఎవరో తెలుసా..? అసలు ఊహించి ఉండరు..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.