వినాయకుడికి బుధవారం నాడు ఈ 5 పండ్లను నైవేద్యంగా పెడితే విఘ్నాలన్నీ తొలగిపోతాయి..

Ads

సాధారణంగా ప్రతి శుభ కార్యంలో మొదట వినాయకుడిని పూజిస్తారు. ముందుగా వినాయకుడిని పూజించడం వల్ల ఆ కార్యంలో విజయం వస్తుందని విశ్వసిస్తారు. గణేషుడికి  మోదకంతో పాటుగా చాలా రకాల పండ్లను కూడా నైవేద్యంగా పెడుతారు. అయితే భోపాల్‌కు చెందిన జ్యోతిష్య శాస్త్ర నిపుణుడు అయిన హితేంద్ర శర్మ గణేశుడిని అనుగ్రహం పొందడానికి ఈ  5 పండ్లను నైవేద్యంగా పెట్టాలని తెలిపారు.

Ads

వినాయకుడి పూజకు విశేష మహత్యం ఉంది. హిందువులు ఏ శుభకార్యం మొదలు పెట్టాలనుకున్న ముందుగా గణేశుడి పూజతోనే మొదలు పెడతారు. గణేశుడికి బుధవారం సమర్పితం. ఆ రోజున వీధి  విధానాలతో గణేశుడిని పూజిస్తే జీవితంలోని కష్టాలన్ని తొలగిపోతాయిని చెబుతున్నారు. అందువల్ల ఈ  5 పండ్లను ఆ విఘ్నాధిపతికి నైవేద్యంగా సమర్పించి, ఆయన దీవెనలు పొందవచ్చు. మరి ఆ 5 పండ్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. అరడిపండు:
అరటిపండ్లు అంటే వినాయకుడుకి ఎంతో ప్రీతికరం. ఆయన చాలా ఇష్టంగా ఈ పండును స్వీకరిస్తారు. వినాయకుడుకి అరటిపండును నైవేద్యంగా పెట్టి, ప్రసాదాన్ని సేవిస్తే దోషాలు, రోగాలు దూరమవుతాయి.
2. సీతాఫలం:
ఈ ఫలం శీతాకాలంలో మార్కెట్‌లోకి వస్తుంది. చాలా రుచిగా ఉండే సీతాఫలం అంటే గణపతికి చాలా ఇష్టం. సీతాఫలంను పోషకాల నిధి అని అంటుంటారు. ఈ ఫలాన్ని గణపతికి నైవేద్యంగా పెట్టినట్లయితే వినాయకుడు చాలా ఆనందిస్తాడు. ధన్యప్రాప్తి కలుగుతుంది.
3. బేల్ పండు:
ఈ పండు అంటే శివుడు మరియు గణపతికి చాలా ప్రియమైనది. వినాయకుడికి సమర్పించడం వల్ల ఇద్దరి ఆశీస్సులు కలుగుతాయి. దాంతో చేపట్టిన కార్యాలన్నీ సఫలం అవుతాయి.
4. నేరేడు పండు:
ఇది వర్షాకాలంలో లభిస్తుంది. గణపతికి నేరేడు పండు కూడా ఇష్టమైన ఫలం. విశ్వాసుల ప్రకారం అయితే సిద్ధి వినాయకుడి అనుగ్రహం పొందడానికి బుధవారం నాడు సాయంత్రం గణపతికి నేరేడు పండును పెట్టి, తరువాతి రోజు ఆ పండును కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంచాలి.
5. జామ పండు:
వినాయకుడుకి అత్యంత ప్రీతికరమైన ఫలం జామ అని చాలా మందికి తెలియదు. కొద్దిమందికి మాత్రమే తెలుసు. వినాయకుడి అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరినప్పుడు జామ పండు వినాయకుడుకి సమర్పించవచ్చు.
Also Read: పారిజాత పుష్పాలను పొరపాటున కూడా వేరేవారి దగ్గర నుండి తీసుకోని పూజ చేయకూడదు.. ఎందుకో తెలుసా?

 

Previous articleఎన్టీ రామారావు తన కొడుకులకి ఆస్తి ఎంత ఇచ్చారో తెలుసా?
Next articleశబరిమల అయ్యప్ప స్వామి18 మెట్ల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.