ఈ ముగ్గురు సెలబ్రిటీల లో ఉండే ఈ కామన్ పాయింట్ ని మీరు గమనించారా..?

Ads

భగవంతుడు మీద నమ్మకం కొంత మందికి ఉంటే కొంత మందికి మాత్రం భగవంతుడి మీద అస్సలు నమ్మకం ఉండదు. చాలామంది అసలు దేవుడు ఉన్నాడనే విషయాన్ని నమ్మరు ఏదైనా విషయంలో సమస్యను ఎదుర్కొని చావు అంచుల వరకు వెళ్లిన వాళ్ళు మాత్రం కచ్చితంగా దేవుడిని నమ్ముతూ ఉంటారు. ఇండస్ట్రీ లో దేవుడిని బాగా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో సెలబ్రిటీలకి కూడా నమ్మకం ఉంది. ముఖ్యంగా సాయి పల్లవి, సాయి ధరమ్ తేజ్, సమంత గురించి చెప్పుకుని తీరాలి. వీళ్ళకి భగవంతుడు అంటే ఎంతో నమ్మకం ఎక్కువ.

ఈ ముగ్గురి గురించి ఒక వార్త బయటకు వచ్చింది. వీళ్ళ ముగ్గురు కూడా ఈ మధ్య ఎక్కడ కనబడుతున్నా కూడా చేతిలో రుద్రాక్ష మాల ధరించి కనపడుతున్నారు. ఎందుకు మరి అసలు వీళ్ళు రుద్రాక్ష మాలని ధరిస్తున్నారు..? దాని వెనక కారణం ఏంటి అనేది తెలుసుకుందాం.

Ads

సాయి పల్లవి కి భగవంతుడు మీద నమ్మకం ఎక్కువ. మొదట నుండి కూడా సాయి పల్లవి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉండడంతో ఆమె చేతికి రుద్రాక్ష మాల ధరించి ఎప్పుడూ కనపడుతోంది. సమంత విషయానికి వస్తే సమంత మాయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడింది.

అప్పటి నుండి కూడా ఆమె రుద్రాక్ష మాలతోనే కనపడుతోంది. నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడం.. అలానే సమంత మాయోసైటిస్ తో బాధపడడం దీంతో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని ప్రశాంతత కోసం మనోధైర్యాన్ని కలిగించడం కోసం రుద్రాక్ష మాలని ధరిస్తోంది.

అందుకే ఈ మధ్య కాలంలో సమంత ఎక్కడ కనపడుతున్నా కూడా చేతిలో రుద్రాక్ష మాల ఉంటోంది. సాయి ధరమ్ తేజ్ అయితే బైక్ ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడ్డ అప్పటి నుండి కూడా రుద్రాక్ష మాలని ధరిస్తున్నారు. మానసిక ప్రశాంతత కోసం ధైర్యం కోసం ఈయన రుద్రాక్షమాలని ధరించి జపం చేస్తున్నారు అందుకే ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ చేతికి రుద్రాక్ష మాల ఉంటోంది.

Previous article“రకుల్ ప్రీత్ సింగ్” పెళ్లి జరిగిన హోటల్ ఏదో తెలుసా..? అందులో ఒక్క రూంకి ఇంత ఖర్చు అవుతుందా..?
Next articleMuthyala Venkateshwara Rao: అనకాపల్లి స్థానం.. లిస్ట్‌లో ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీఆర్!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.