2022 లో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Ads

ప్రతి సంవత్సరం సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు. అలా వచ్చిన హీరోయిన్లలో ఎవరు ఉంటారో, ఎవరు వెళ్తారనేది ఆ హీరోయిన్లు నటించే చిత్రాలను చూసి ఒక అంచనాకి రాలేము.

సాధారణంగా సినీపరిశ్రమలో హీరోయిన్లకు లైఫ్ టైం తక్కువే. అయితే కొందరు కథానాయకలు సినీ పరిశ్రమకి వచ్చి పది సంవత్సరాలు దాటినా కూడా అగ్రస్థానంలో దూసుకెళ్తున్నారు. హీరోలతో పోలిస్తే వీరి రెమ్యూనరేషన్ కూడా తక్కువగా ఉంటుంది. మరి 2022 లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్లు ఎవరో, ఇప్పటికీ ఏ హీరోయిన్ స్థానం ఎలా ఉందనే విషయం చూద్దాం..
1.నయనతార :
సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార ఇప్పటికీ అదే ఇమేజ్ ను కొనసాగిస్తోంది. నయన్ కి పెళ్లి అయినా ఆమెకున్న డిమాండ్ కొంచెం కూడా తగ్గలేదు. ఆమె చేతిలో ప్రస్తుతం 4,5 ప్రొజెక్ట్స్ ఉన్నాయి. నయనతార 15 కోట్ల భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.
2. పూజా హెగ్డే :
బుట్టబొమ్మ పూజా హెగ్డే 2022లో 5 ప్రొజెక్ట్స్ కు సైన్ చేసిందని తెలుస్తోంది. పూజ 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.
3.రష్మిక :
2022లో నేషనల్ క్రాష్ రష్మిక ఐదు చిత్రాలకు ఓకే చేసిందని సమాచారం. రష్మిక 10-12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.

4) కీర్తి సురేష్ :
కీర్తి సురేష్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. కీర్తి రూ.8-10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు వినికిడి.

5) కృతి శెట్టి :
ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నాలుగు చిత్రాలకు సైన్ చేసిందని సమాచారం. ఆమె రూ.7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.
6)సమంత :
సమంత 2022 లో రెండు చిత్రాలు చేసింది. ఈమె రూ. 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.

Ads

7) నిత్యా మేనన్ :
నిత్యా మేనన్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్, ధనుష్ తో తిరు లాంటి పెద్ద చిత్రాల్లో నటించింది. నిత్యా రూ.4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.

8) రాశీ ఖన్నా :
రాశీ ఖన్నా 2022 లో నాలుగు చిత్రాల్లో నటించింది. రాశీ రూ.4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.
9) తమన్నా :
తమన్నా 2022 లో 3 చిత్రాల్లో నటించింది.  తమన్నా రూ.3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.
10) ఐశ్వర్య లక్ష్మీ :
ఐశ్వర్య లక్ష్మీ 6 చిత్రాల్లో నటించింది. ఆమె రూ.3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.
11) సాయి పల్లవి :
సాయి పల్లవి 2022లో  6 చిత్రాల్లో నటించింది. ఆమె రూ.3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.
12) అనుపమ పరమేశ్వరన్ :
అనుపమ 2022 లో నాలుగు  సినిమాల్లో చేసింది. ఆమె రూ.2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.
13) ప్రియాంక అరుళ్ మోహన్ :
ఈమె 4 చిత్రాల్లో నటించగా , రూ.2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.
14)శృతి హాసన్ :
ఈమె 3 పెద్ద సినిమాల్లో చేస్తోంది. శృతి రూ.3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.
15)త్రిష :
త్రిష రెండు చిత్రాలకు సైన్ చేసింది. ఆమె రూ.2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.
Also Read: గాన గంధర్వుడు ఎస్పీబాలసుబ్రమణ్యం అరుదైన ఫోటో గ్యాలరీ..

Previous articleజనసేన అధినేత సీఎం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బ్రహ్మం గారి కాలజ్ఞానం
Next articleమెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సెన్సార్ టాక్.. మెగా మాస్ జాతర..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.