సినిమాల్లోకి రాకముందే సామ్ ఓ యాడ్ చేసిందని మీకు తెలుసా..?

Ads

నాగ చైతన్య హీరోగా వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సామ్. సామ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. చాలా సినిమాలతో పాపులారిటీని సంపాదించుకుంది. తర్వాత చైతుని వివాహం చేసుకోవడం… కాలం కలిసి రాకపోవడంతో వాళ్ళిద్దరు విడిపోవడం ఇవన్నీ మనకి తెలిసిందే.

ఇప్పుడు సమంత అనారోగ్య సమస్యతో బాధ పడుకుతోంది. తాజాగా యశోద చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో సమంత చాలా అద్భుతంగా నటించింది.

Ads

సమంత నటన చూసి ఫ్యాన్స్ అయితే తెగ ప్రశంసిస్తున్నారు. సామ్ గురించి చాలా మంది ఈ విషయాలు తెలియవు. ఈమె డిగ్రీ లో వున్నప్పుడే ఓ యాడ్ చేసింది. ఇక వివరాలని చూస్తే.. సమంత కేరళ లో జన్మించింది. కానీ తన తల్లిదండ్రుల ఉద్యోగం కోసం తమిళనాడులో వాళ్ళు సెటిల్ అయ్యారు. తమిళనాడులోని ఆమె విద్యాభ్యాసం సాగింది. సమంతకి నటన అంటే ఎంతో ఇష్టం. డిగ్రీ చదువుతున్నప్పుడే ఆమె కల్చరల్ యాక్టివిటీస్ వంటి వాటిలో ఆమె ఆసక్తితో పాల్గొనేది.

పైగా డిగ్రీ చదువుకునే రోజుల్లో తమిళ నాడుకు చెందిన ఆశిక టెక్స్టైల్స్ ప్రొడక్ట్స్ ని ఆమె ప్రమోట్ చేసేది. ఇలా ప్రొడక్ట్స్ తో ప్రమోట్ చేసిన ఒక యాడ్ లో ఆమె నటించింది. తనకి కొంత డబ్బులు ఈ యాడ్ చేయడం వలన వస్తాయని భావించి ఆమె ఈ యాడ్ లో నటించింది. ఈ యాడ్ లో నటించేందుకు సమంతకి ఐదు వేల రూపాయల వరకు ఇచ్చారు. ప్రస్తుతం ఈ యాడ్ యూట్యూబ్ లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Previous articleఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు “సద్గురు” ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు అంటే..?
Next articleసినిమా పాటలనే కాదు… సీన్స్ ని కూడా వదలట్లేదుగా..? అసలు సీరియల్ లో ఇలాంటి సీన్ ఎందుకు పెట్టారు..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.