ప్రేయసిని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ శార్ధూల్ ఠాకూర్..

Ads

ఇండియన్ క్రికెటర్ శార్ధూల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా మిథాలీ పారుల్కర్‌ ను ప్రేమిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ ప్రేమ జంట పెద్దల సమక్షంలో ఈ నెల 27న పెళ్ళితో ఒకటి కాబోతున్నారు.

శనివారం నుండి శార్ధూల్ పెళ్లి వేడుకలు మహారాష్ట్రలో కర్జత్‌‌లో మొదలు అయ్యాయి. ఈ పెళ్ళికి పరిమిత సంఖ్యలో ఫ్యామిలీ మెంబర్స్ కి, కొద్దిమంది సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందింది. ఇక వీరి వివాహానికి 200 మంది వరకు అతిథులు హాజ‌రు అవనున్నట్లుగా తెలుస్తోంది. వివాహ వేడుకలలో భాగంగా శార్ధూల్ ఠాకూర్ హల్దీ సెలెబ్రేషన్స్‌ ని తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి జరుపుకున్నాడు. ఈ సెలెబ్రేషన్స్‌లో శార్ధూల్ డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే మిథాలీ పారుల్కర్‌, శార్ధూల్ ఠాకూర్ కి 2021 నవంబరు 29న నిశ్చితార్ధం జరిగింది. నిశ్చితార్ధం జ‌రిగిన సంవత్సరం త‌ర్వాత వీరిద్దరు పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. నిశ్చితార్ధం తర్వాత వీరి వివాహం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పడు భారత్ గడ్డపై భారత్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ జరుగుతోంది. శార్ధూల్ ఠాకూర్ ఈ టెస్టు జట్టులోకి ఎంపిక వలేదు. ఇక మార్చి 17 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవనుంది.
శార్ధూల్ ఠాకూర్ ఈ వన్డే సిరీస్‌కి ఆడే భారత జట్టుకి ఎంపికయ్యాడు. అందువల్ల దొరికిన ఈ 3 వారాల విరామ సంయమలోనే వివాహం చేసుకోవాలని శార్ధూల్ నిర్ణయించుకున్నాడు. అంతే కాకుండా ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31 నుండి మొదలు అవనున్న విషయం అందరికి తెలిసిందే. గత సంవత్సరం ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకి ఆడిన శార్ధూల్ ఠాకూర్, ఈ సంవత్సరం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకి ఆడబోతున్నాడు.
Also Read: బాలయ్య చెప్పిన ”కత్తితో కాదురా, కంటి చూపుతో చంపేస్తా” అనే డైలాగ్ ను ఎవరి దగ్గర నుండి కాపీ చేశారంటే..

Ads

Previous articleఈ 4గురు దర్శకుల కుమార్తెలు ఏం చేస్తున్నారో తెలుసా?
Next articleడాక్టర్ ప్రీతి కరోనా‌ను ఎదిరించి నిలిచింది.. కానీ, వేధింపులకు బలి అయ్యింది.
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.