”సౌందర్య” భర్త ఎవరో మీకు తెలుసా..? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?

Ads

సౌందర్య తెలియని వాళ్ళు ఉండరు. సౌందర్య ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో సావిత్రి తర్వాత అంత పేరు పొందిన నటి సౌందర్యే. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించి సౌందర్య అందరిని బాగా అలరించారు.

సౌత్ సినిమా ఇండస్ట్రీ లో తన నటన తో ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు సౌందర్య. సౌందర్య నాన్న గారికి సత్యనారాయణ గారితో పరిచయం ఉండడం వలన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సౌందర్య.

ఆమె ఇండస్ట్రీ లోకి వచ్చిన కొద్ది రోజులకే పెద్ద స్టార్ అయిపోయారు. చాలా మంది అగ్ర హీరోల సరసన సౌందర్య నటించి మెప్పించారు, వెంకటేష్ సౌందర్య, వెంకటేష్ చిరంజీవి పెయిర్ అప్పట్లో హిట్ పెయిర్. సౌందర్య తో ఈ హీరోలు జంటగా నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా హిట్ అవ్వడం విశేషం. బాలకృష్ణ దర్శకత్వంలో నర్తనశాల సినిమా షూటింగ్ మొదలై ఆగిపోయింది ఇదే సౌందర్య ఆఖరి సినిమా. సౌందర్య కి వరుసగా అవకాశాలు వస్తున్నప్పుడు ఆమె బీజేపీ పార్టీలో చేరారు. పార్టీ ప్రచారం కోసం ఆమె హెలికాఫ్టర్ లో బయలుదేరారు కానీ ప్రమాదవశాత్తు హెలికాఫ్టర్ లో బయలుదేరిన సౌందర్య చనిపోయారు.

Ads

అయితే సౌందర్య తో పాటు తన సోదరుడు అమర్ కూడా అదే హెలికాప్టర్లో ట్రావెల్ చేయడం వలన అతను కూడా చనిపోయారు. సౌందర్య చనిపోయినప్పటికీ ఆమెకి వివాహం కూడా అయింది అయితే తన భర్త గురించి చాలా మందికి తెలియదు. సౌందర్య తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అలానే వరుస కి మేనమామ అయిన రఘు ని 2003 లో వివాహం చేసుకున్నారు. రఘు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. రఘు తన భార్య సౌందర్య మరణించడంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయారు. రఘు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. 2011లో ఇంకో పెళ్లి చేసుకున్నారు రఘు. ప్రస్తుతం రఘు గోవా లో ఉంటున్నారు.

Previous articleత్రిశూలానికి బదులుగా ఈ శివాలయంలో ఎందుకు పంచశూలాన్ని పెట్టారు..? ఈ ఆలయం రహస్యం ఇదే..!
Next article50 లక్షలు పెట్టి తీస్తే…2 కోట్లు రాబట్టిన ఈ ఈవీవీ సినిమా గురించి చాలామందికి తెలియని విషయాలివే.!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.