వైరల్ గా మారిన కృష్ణ వీలునామా.. కొడుకులను కాదు అని కోట్ల ఆస్తి వాళ్లకు రాశాడా?

Ads

సూప‌ర్ స్టార్ కృష్ణ ఇటీవ‌ల కార్డియాక్ అరెస్ట్ తో మ‌ర‌ణించిన సంగతి అందరికి తెలిసిందే. కృష్ణ మరణం అటు కుటుంబ స‌భ్యుల‌ను ఇటు అభిమానుల‌ను బాధలో ముంచింది. ఇది జరిగి నెల దగ్గరికి వస్తున్న కూడా ఇంకా కృష్ణ గురించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

Ads

కృష్ణ చనిపోయిన తరువాత ఆయ‌న‌ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వీటిలో సూప‌ర్ స్టార్ కృష్ణ ఆస్తుల గురించి కూడా వస్తున్నాయి. హీరో కృష్ణ చిత్రాల ద్వారా కోట్ల‌రూపాయలు సంపాదించిన సంగ‌తి అందరికి తెలిసిందే. ఒక సంవత్సరంలో ప‌దుల సంఖ్య‌లో చిత్రాలలో నటించిన ఘ‌న‌త సూప‌ర్ స్టార్ కృష్ణకే సొంతం. అంతే కాకుండా ఆయన ఫామ్ లో ఉన్నప్పుడు కృష్ణ‌ ఎక్కువ పారితోషకం తీసుకున్న రోజులు ఉన్నాయి.అయితే కృష్ణ సంపాదించిన డ‌బ్బును వృధాగా ఖ‌ర్చు చేయకుండా, చాలా పొదుపుగా ఖ‌ర్చు పెడుతూ ప్రాప‌ర్టీలు కొనేవారు. ఆయన సినిమాల్లో న‌టించ‌డమే కాదు, సొంత బ్యానర్ లో సినిమాల‌ను నిర్మించారు. ఇక సూప‌ర్ స్టార్ కృష్ణ సంపాదించిన ఆస్తులను ఇదివరకే కుమారులైన మ‌హేశ్ బాబు, ర‌మేష్ బాబుకు సమానంగా ఇచ్చాడంట.అయితే కృష్ణ పేరిట ఆయన చనిపోయేనాటికి కూడా నాలుగు వంద‌ల కోట్ల ఆస్తులు ఉండేవ‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కృష్ణ ఆ 400 కోట్ల ఆస్తుల‌ను త‌న మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌ పేరిట వీలునామా రాశారని సినివర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.అయితే సూప‌ర్ స్టార్ కృష్ణ ఈ వీలునామాను రాసి కూడా చాలా కాలం అవుతుందని తెలుస్తోంది. సాధారణంగా వీలునామా రాయడం అంటే త‌ను చనిపోయిన తరువాత తన పేరుతో ఉన్న ఆస్తులు ఎవ‌రికి ఇవ్వాలో తెలుపుతుంది. ఇక కృష్ణ వీలునామా ప్ర‌కారం అయితే ఆయ‌న ఆస్తులు మ‌హేశ్, ర‌మేష్ బాబు కొడుకులు, కూతుర్లతో పాటూగా, కృష్ణ కుమార్తెల సంతానానికి కూడా చెందుతాయి.

Also Read: మరణించిన త‌రవాత విడుద‌లైన 6 టాప్ స్టార్స్ సినిమాలు ఏమిటో తెలుసా..?

Previous articleఉదయ్ కిరణ్ ఈ 10 సినిమాలు చేసి ఉంటే నిలదొక్కుకునేవాడు!
Next articleమెగా ఫ్యామిలీలో ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న వారు ఎవరో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.