ASIA CUP: ఇండియా vs పాక్ సూపర్4 మ్యాచ్ తర్వాత సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Ads

ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియన్ ఆటగాళ్ల కంటే కూడా.. వారిని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ఒక ఆఫ్గాన్ బ్యూటీ సోషల్ మీడియాలో అందరి మనసులు దోచుకుంది. ప్రస్తుతం ఈ మిస్టీరియస్ బ్యూటీ నెట్ లో వైరల్ గా మారింది.

పాకిస్తాన్ బౌలింగ్ కి తేలిపోతారు అన్న విమర్శలు ఎదుర్కొన్న టీం ఇండియన్ బ్యాట్స్మెన్లు.. తమ సత్తా చాటి పాక్ ప్లేయర్లను గ్రౌండ్ మొత్తం పరుగులు పెట్టించారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 228 పరుగుల భారీ తేడాతో భారత్ తన విజయకేతనాన్ని ఎగురవేసింది. ఇటువంటి ఆట కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులు…చాలా రోజుల తర్వాత భారత్ ఆటగాళ్ల విశ్వరూపం చూసి ఆనందించారు.

ఇదిలా ఉండగా..ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ గర్ల్ వాజ్మా అయూబీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో ఇండియాకు జై కొట్టింది. మెన్ ఇన్ బ్లూ విజయం సాధించాలని ఆకాంక్షించడమే కాకుండా…నా సెకండ్ హోమ్ టీంకు శుభాకాంక్షలు అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టింది. ఈమె పెట్టిన పోస్ట్ కు భారత్ క్రికెట్ అభిమానులు ఆనందిస్తుంటే పాక్ ఫాలోవర్స్ మాత్రం కాస్త ఆగ్రహిస్తున్నారు.

వాజ్మా అయూబీ కి సోషల్ మీడియాలో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆఫ్గనిస్తాన్ లో జరిగిన పలు మ్యాచ్లకు ఆమె హాజరయ్యింది. టీమిండియాను సపోర్ట్ చేస్తూ బైజుస్ లోగో తో పాటు ఇండియా అని రాసి ఉన్న బ్లూ కలర్ టీ షర్ట్ ధరించిన ఈమె ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Previous articleరెండేళ్ళ పాటు అలిగి…తండ్రిపై మౌన పోరాటం చేసిన హరికృష్ణ…ఎందుకో తెలుసా.?
Next article“ఆ వింత కారణంతో పెళ్లిని రిజెక్ట్ చేసింది.?”…అంటూ పెళ్లి చూపులకి వెళ్లిన ఓ అబ్బాయి పంపిన మెసేజ్ ఇది..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.