పాకిస్తాన్ నుండి భారత్ కి తిరిగి వచ్చిన అంజు ఇప్పుడు ఎక్కడ ఉంది..? ఏం చేస్తోంది..?

Ads

సోషల్ మీడియా, ఆన్ లైన్ ప్రేమలు ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వాటిలో ఇద్దరు యువతుల ప్రేమ కథలు మాత్రం ఇప్పటికీ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నాయి. ఒకరు ప్రేమ కోసం పాకిస్థాన్ ని విడిచి ఇండియాకి వస్తే, మరొకరు ఇండియా వదిలి పాకిస్థాన్ కి వెళ్లారు.

Ads

ఫేస్ బుక్ లో పరిచయం అయిన లవర్ కోసం భర్తను పిల్లలను వదిలి పాకిస్థాన్ కి వెళ్ళి యువతి అంజు,  పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయినట్టు నెట్టింట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే పాక్ వెళ్ళిన అంజు ఇటీవల భారత్ కి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సాక్షి న్యూస్ కథనం ప్రకారం, ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్థాన్​ కు వెళ్లిన అంజు, వార్తల్లో నిలించింది. మధ్యప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన అంజు అనే మహిళకు వివాహం అయ్యి, 15 ఏళ్ల కూతురు, ఆరేళ్ల కొడుకు  ఉన్నారు. అయితే 2019లో ఫేస్​బుక్​ ద్వారా నస్రుల్లాతో పరిచయం అయ్యి, ఆ తరువాత ప్రేమకు దారి తీసింది. ప్రేమలో ఉన్న అంజు గత జులైలో భర్తను, పిల్లలను జైపూర్‌లో ఉన్న బంధువుల ఇంటికి అని చెప్పి, లవర్ కోసం పాకిస్థాన్​ కు వెళ్లింది.
పాక్ లోనే నస్రుల్లా, అంజు వివాహం చేసుకున్నారు.పెళ్లి తరువాత ఫాతిమాగా పేరు మార్చుకుంది. ఈ జంట ఖైబర్​ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని అప్పర్​ దిర్​ జిల్లాలో ఒక ఊరులో నివసిస్తున్నారు. దానికి సంబంధించిన వార్తలు కూడా ఆ సమయంలో ఎక్కువగా వినిపించాయి. అయితే ఇటీవల అంజు తిరిగి ఇండియా వచ్చిందని తెలుస్తోంది. పిల్లలను తీసుకెళ్లాడానికి వచ్చినట్టు అయితే ప్రస్తుతం ఆమె ఇండియాలో ఎక్కడుందో తెలియరాలేదు. పాక్​నుండి ఢిల్లీకి వచ్చింది. కానీ ఆమె రాజస్థాన్​లో భివాడికి వెళ్లలేదు. ఆమె పిల్లలను కూడా కలవలేదు.
ఆమె ఆచూకీని ఆఫీసర్లు సీక్రెట్ గా ఉంచుతున్నారు. భివాడిలోని వారు అంతకముందు ఉండే రెసిడెన్షియల్ సొసైటీ దగ్గర పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళే వాహనాలను, కొత్త వ్యక్తులను తనిఖీ చేసి, లోపలికి అనుమతిస్తున్నారు. ఇంటలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన టీమ్ అంజు పిల్లలను విచారిస్తున్నారు. కాగా ఆమె పిల్లలు తల్లిని కలవమని అంటున్నారు.

Also Read: ఉద్యోగం నుండి తొలగించినందుకు అలా చేసాడు అనుకున్నారు…కానీ బయటపడ్డ ట్విస్ట్ ఏంటంటే.?

Previous article“ప్రభాస్” గురించి వేణు స్వామి చెప్పినట్టే జరిగిందా..? మరి ఇప్పుడు సలార్ ఎలా ఉంటుంది..?
Next articleకన్నీళ్లు పెట్టిస్తున్న సిల్క్ స్మిత చివరి ఉత్తరం ! అందులో ఏమని రాసిందంటే ?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.