ఎన్టీఆర్ భార్య బసవతారకం, చిరంజీవి భార్య సురేఖలో ఉన్న పోలిక ఏమిటో తెలుసా?

Ads

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని విషయాల్లో కొందరికి సానుకూలమైన అభిప్రాయం ఉంటుంది. అలాంటి వారు సినిమా విషయాలలో, వివాదాలలో జోక్యం చేసుకోకుండా తమ పని ఏమిటో తాము అన్నట్టుగా ఉంటారు. అప్పట్లో ఎన్టీ రామారావు భార్య బసవతారకం, అక్కినేని నాగేశ్వర రావు సతీమణి అన్నపూర్ణమ్మ, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి, శోభన్ బాబు సతీమణి, ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ లాంటి వారు కొందరు తమ పని తాము చూసుకునేవారు.

Ads

తమ భర్తలు ఎంత పెద్ద హీరోలు అయినా కూడా ఎప్పుడూ కూడా వారి పనులలో మాత్రం జోక్యం చేసుకునే వారు కాదు. ఈ క్రమంలోనే ఎన్టీ రామారావు భార్య బసవతారకంకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు కొన్ని విషయలలో పోలిక ఉందని వారి గురించి తెలిసిన సినీ ప్రముఖులు అంటుంటారు. అయితే బసవతారకం మరియు సురేఖకు మధ్య పోలిక ఉన్న ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఎన్టీ రామారావు గారు తన సినిమాలటో చాలా బిజీగా ఉన్నప్పటికీ, ఆయన భార్య ఇంట్లోనే ఉండేవారు. ఆమె ఎప్పుడూ సినిమాల విషయంలో జోక్యం చేసుకోలేదంట. ఇక ఇంటికి ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు వచ్చినా, అభిమానులు వచ్చినా, వారి కోసం వంట చేసి పెట్టేవారంట. ఇంటికి వచ్చినవారు తిన్న తరువాత గాని పంపించేవారు కాదంట.
ఇక చిరంజీవి సతీమణి సురేఖ కూడా బసవతారకం లాగే అంటారు. సురేఖ కూడా చిరంజీవిని కలవడానికి ఇంటికి ఎవరు వచ్చినా కూడా తినకుండా పంపించరట. మెగాస్టార్ ఫ్యాన్స్ వచ్చినా సరే వారికి కూడా  భోజనం చేశాకనే వెళ్ళనిస్తారంట. ఈ విషయన్ని పలువురు హీరోయిన్లు గతంలో చెప్పారు. తాము షూటింగ్ టైమ్ లో చిరంజీవి ఇంటికి వెళ్ళినపుడు ఆయన భార్య సురేఖ దగ్గరుండి మరీ వడ్డించేదని, అలగే తమకు కావాల్సిన వంతలెవయినా కూడా వండి పెట్టే వారని పలు ఇంటర్వ్యూలలో వారు తెలిపారు.
Also Read: ప్రేమికుడు మూవీ షూటింగ్ ను మధ్యలోనే ఆపాలని గవర్నర్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసా?

 

Previous articleచాణక్య నీతి: భార్యాభర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండాలంటే.. ఈ 4 విషయాలని మరచిపోవద్దు..!
Next articleఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు బౌద్ధ సన్యాసి..! ఎవరంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.