రాఖీ రాఖీ అంటూ ట్రెండ్ అయిన ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరో తెలుసా.? ఈ ఫోటోలు ఓ లుక్ వేయండి.!

Ads

సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలెబ్రిటీలు అవుతున్నారు. రీల్స్ ద్వారా పాపులర్ అయ్యి సినిమాల్లోకి కూడా వెళ్లిపోతున్నారు. అందులోనూ ముఖ్యంగా డాన్స్, సింగింగ్ లాంటి టాలెంట్ ఈ సోషల్ మీడియా ద్వారా బయటికి వస్తోంది.

watch video:

ఇలా ఇప్పుడు మనకి సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి తెర మీద కనిపిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఒక ముగ్గురు అమ్మాయిలు కళ్ళజోడు పెట్టుకొని డాన్స్ వేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది.

Ads

ఈ వీడియో చూశాక చాలామంది వీళ్ళు ఎవరు అని వెతకడం మొదలుపెట్టారు. ఈ వీడియోలో అమ్మాయిలు ఒక మలయాళం పాటకి డాన్స్ వేసి పోస్ట్ చేశారు. కానీ మనవాళ్లు దాన్ని పాట మార్చేసి ప్రతి పాటకి సింక్ అయ్యేలాగా చేశారు. కొంతమంది రాఖీ రాఖీ పాటకి సింక్ చేస్తే, ఇంకొంతమంది చల్లని రాత్రి వెన్నెలలో అని డీజే పాటకి కూడా ఈ వీడియో ఎడిట్ చేసి పెట్టారు.

అయితే ఈ వీడియోలో ఉన్న అమ్మాయిలు అశ్వతి, నేహ, రియా. వీళ్ళ ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్. ఏదో సరదాకి వీడియో చేసి పోస్ట్ చేశారు. కానీ ఊహించని రేంజ్ లో ఈ వీడియో పాపులర్ అయ్యింది. అంతకుముందు ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుకొట్టిన వీడియో కూడా ఇదే రేంజ్ లో ఫేమస్ అయ్యింది. దాని తర్వాత ఇప్పుడు ఈ వీడియో కూడా పాపులర్ అయ్యింది.

Previous articleవరలక్ష్మి టిఫిన్స్ కేసులో నిందితురాలు అనురాధ గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… లక్షల్లో జీతం పెట్టుకొని.?
Next articleబంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ, బుమ్రా ప్లేస్‌లో ఆడేది ఆ ముగ్గురేనా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.