చిరంజీవి ఆ మూవీలో అలా చేయడం నచ్చలేదు.. దర్శకుడు రాజమౌళి కామెంట్స్

Ads

తెలుగు సినిమా ఖ్యాతిని దర్శకధీరుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు దక్కుతున్నాయి. నాటు నాటు పాట ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన విషయం తెలిసిందే.

దర్శకుడు రాజమౌళి అభిమాన హీరోలు ఎవరంటే తెలుగు సీనియర్ హీరోలు అవడం గమనార్హం. రాజమౌళి అభిమానించే హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. రాజమౌళి ఒక సారి చిరంజీవి ‘కొదమ సింహం’ మూవీ గురించి మాట్లాడుతూ ఆ చిత్రంలో చిరంజీవి చేసిన పని తనకు నచ్చలేదని చెప్పారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ సమయంలో జక్కన్న మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘కొదమ సింహం’ సినిమాలో ఒక సీన్ తనకు నచ్చలేదని తెలిపారు. ఆ సన్నివేశం ఏమిటి అంటే, ఆ చిత్రంలో ఒక సన్నివేశంలో చిరంజీవి తలను బయటకు వుంచి, మిగతా శరీరాన్ని ఇసుకతో కప్పెట్టేస్తారు. అయితే గుర్రం వచ్చి ఆ సమయంలో  చిరంజీవిని కాపాడుతుందని, కానీ చిరంజీవి ఇసుకను నుండి బయటకు వచ్చాక ఆ  గుర్రాన్ని మాత్రం  పట్టించుకోరని అన్నారు.
అయితే తన ప్రాణం రక్షించిన గుర్రానికి మెగాస్టార్ థ్యాంక్స్ కూడా  చెప్పలేదని, అప్పుడే ఆ సీన్ నా మైండ్ లో రిజిష్టర్ అయ్యిందని జక్కన్న చెప్పారు. ఆ సన్నివేశం స్పూర్తితోనే మగధీర మూవీలో గుర్రం సన్నివేశం రాసామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్, గుర్రం మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని తెలిపారు.
అయితే ‘కొదమ సింహం’ చిత్రం విషయంలో చిరంజీవి మిస్టేక్ ఏమి లేదని డైరెక్టర్ ఏం చెబితే అదే మెగాస్టార్ చిరంజీవి చేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రాజమౌళి ప్రతి సీన్  విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందువల్లే ఆయన తెరకెక్కించే చిత్రాలు ఈ  స్థాయిలో విజయాన్ని సాధిస్తున్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు.

Ads

Also Read: ఈ 4గురు దర్శకుల కుమార్తెలు ఏం చేస్తున్నారో తెలుసా?

Previous articleట్రైన్ లో సీట్లు ఎందుకు బ్లూ కలర్ లో ఉంటాయి…?
Next articleసూపర్ స్టార్ రజినీ కాంత్‌ భార్య లత ఆయనను ఎందుకు ఇష్టపడ్డారో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.