దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు మూవీ తరువాత చేయబోయే సినిమా ఏమిటో తెలుసా?

Ads

దర్శకధీరుడు రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏంటి అనేది అందరికి తెలిసిందే.  జక్కన తర్వాత చేయబోయే మూవీ మహేష్ బాబుతోనే చాలా రోజుల క్రితమే క్లారిటీగా తెలిసింది.

Ads

వాస్తవానికి పది సంవత్సరాలుగా చర్చల స్టేజ్ లోనే ఉన్న ఈ చిత్రం. ఇలా ఇన్నేళ్ల  తరువాత మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి మూవీ వచ్చే సంవత్సరం ఆగస్టు తరువాత ప్రారంభం కాబోతుంది. ఈ మూవీ ఆఫ్రికన్ నేపథ్యంలో  ఉంటుదని ఇప్పటికే రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో  తెలిపారు. ఈ సినిమాకు కథ కూడా రెడీ అయ్యిందని సమాచారం. ఇందులో మహేష్ బాబు ట్రావెలర్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు. ఇలాంటి పాత్రలో ఆయన మొదటిసారి చేస్తున్నాడు. ఇక ఇలాంటి రిస్కీ పాత్ర ఎంపిక చేసుకోవడం మహేష్ కు సాహసమే. ఆ పాత్రని తెర పై చూపించడం కూడా రాజమౌళికి అంతే రిస్క్ ఉన్న పని. ఈ సినిమా కోసం జక్కన్న ఎక్కువగా అమెరికన్ టెక్నీషియన్స్ ని నమ్ముకుంటున్నాడు. అంతేకాకుండా పూర్తిగా హాలీవుడ్ నటీనటుల తీసుకోవాలని చూస్తున్నాడు. ఈ మూవీ పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. మహేష్ బాబు రాజమౌళి సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైగా ఉండబోతుంది. దీనికి నిర్మాత  సీనియర్ ప్రొడ్యూసర్ కెల్ నారాయణ.
ఇదిలా ఉండగా ఇప్పుడే  మహేష్ సినిమా తరువాత జక్కన్న ఎవరితో మూవీ చేయబోతున్నాడు అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అని వినబడుతోంది. అయితే జక్కన్న ఇప్పటికే వీరిద్దరి కోసం ఒక లైన్ కూడా సిద్ధం చేశాడని ప్రచారం కూడా మొదలు అయ్యింది.
ఇక మహేష్ బాబు మూవీ పూర్తి అయ్యిందంటే, వెంటనే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తో మల్టీస్టారర్ సినిమా స్టోరీని సిద్ధం చేయడానికి జక్కన్న అండ్ టీం రెడీ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ఇద్దరితోనూ  రాజమౌళికి  పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గా మంచి రిలేషన్ ఉంది. ఇక దీనికోసం ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

Also Read:ఆ హీరోయిన్‌ కోసమే ప్రభాస్‌, గోపీచంద్‌ గొడవ పడ్డారా?

Previous article‘యమదొంగ’ సినిమాలో సత్యనారాయణ యముడుగా నటించకపోవడానికి కారణం ఇదేనా?
Next articleకైకాల సత్యనారాయణ ఆస్తులు విలువ ఎంత ఉంటుందో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.