భర్త నుండి విడాకులు తీసుకున్న “మనసు మమత” సీరియల్ నటి..! “కేవలం గౌరవం మాత్రమే ఉంది..!” అంటూ..?

Ads

మొగలిరేకులు, మనసు మమత వంటి సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన శిరీష తన భర్తతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో ఈ విధంగా రాశారు. పోస్ట్ లో శిరీష, “నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని నా అభిమానులతో, శ్రేయోభిలాషులతో షేర్ చేస్తున్నాను. నవీన్, నేను ఒకప్పుడు భార్యాభర్తలు. ఇప్పుడు మేము విడిపోయాం. పరిస్థితులు మా కంట్రోల్ లో లేని కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.”

sirisha serial actress separation

“ఇలాంటి సమయంలో మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. విమర్శలు అంగీకరించం. సపోర్ట్, గౌరవాన్ని మాత్రమే ఆశిస్తున్నాం. నాకు నవీన్ మీద గౌరవం ఉంది. నేను పబ్లిక్ ఐలో ఉన్న ఒక వ్యక్తిని కాబట్టి, ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు, నన్ను అర్థం చేసుకుంటున్నందుకు థాంక్యూ” అని రాశారు. శిరీష సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా చాలా పాపులర్ అయ్యారు. శిరీష మంచి డాన్సర్ కూడా. శిరీష, నవీన్ లకి ఒక బాబు కూడా ఉన్నాడు. శిరీష ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు.

ఇందులో తన వ్యక్తిగత జీవితంలో తాను ఏం చేస్తాను అనే విషయాలని చెప్తూ ఉంటారు. శిరీష సిరిసిల్ల జిల్లాకి చెందినవారు. మొగలిరేకులు సీరియల్ లో సింధు అనే పాత్రతో కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత స్వాతి చినుకులు, మనసు మమత, రాములమ్మ, నాతిచరామి, కాంచన గంగ ఇంకా ఎన్నో సీరియల్స్ లో నటించారు. కొంత కాలం క్రితం స్టార్ మా లో ప్రసారం అయిన చెల్లెలి కాపురం సీరియల్ లో నటించారు. శిరీషకి ఇద్దరు అక్కలు. వారి పేర్లు రజిత, సౌజన్య. వాళ్లు కూడా సీరియల్స్ లో నటిస్తూ ఉంటారు. కార్తీకదీపం సీరియల్ లో చారుశీల పాత్రలో సౌజన్య నటించారు. వీళ్లు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా పాపులర్ అయ్యారు.

Previous articleపెళ్లయ్యాక మగవాళ్లలో వచ్చే మార్పులు ఇవే..! ఇందుకు కారణాలు ఏంటంటే…?
Next article“ప్లీజ్ సార్ ఆపేయండి..!” అంటూ… డైరెక్టర్ “పూరీ జగన్నాథ్” కి ఒక అభిమాని లేఖ..! ఇందులో ఏం ఉందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.