వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డి ఏం చదువుకున్నాడో తెలుసా..? డిగ్రీ ఎందులో పొందాడు అంటే..?

Ads

వైయస్ షర్మిల రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ శాతం రాజకీయాలకి తన జీవితాన్ని కేటాయించిన షర్మిల తన కుటుంబ సభ్యుల గురించి బయట చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి. ఇక షర్మిల కు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు కుమార్తె…కొడుకు పేరు రాజారెడ్డి, కుమార్తె పేరు అంజలి రెడ్డి.

తాజాగా షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే రాజారెడ్డి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. రాజారెడ్డి ఎక్కడుంటాడు ఏం చదువుకున్నాడు అనే విషయాలు ఎవరికి తెలియదు. ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం…

Ads

షర్మిల కొడుకు రాజారెడ్డి అమెరికాలో అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ ప్రెడిక్టివ్ ఎనలైటిక్స్ లో ఎంఎస్సీ చేశారు. ఎంఎస్సి పట్టా పొందే సమయంలో షర్మిల అలాగే వైయస్ విజయమ్మ ఇద్దరు కలిసి అమెరికాకు వెళ్లడం రాజారెడ్డితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షర్మిల కొడుకు రాజకీయాలు వైపు రాకుండా చదువుకున్నాడు. పెళ్లి జరిగిన తర్వాత కూడా పూర్తిగా అమెరికాలోని సెటిల్ అవుతాడని వైఎస్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇక షర్మిల కుమార్తె అంజలి రెడ్డి కూడా బిబిఏ ఫైనాన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. తన పిల్లలు ఇద్దరు ఉన్నత చదువులు చదివి డిగ్రీలు పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందని షర్మిల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కూడా. తాజాగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మళ్ళీ రాజకీయాల వైపు పూర్తిగా టర్న్ అయ్యారు. షర్మిల కాంగ్రెస్ చేరికతో ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతాయ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు

Previous articleపెళ్లయ్యాక ఆడవారు అత్తమామలతో కలిసి ఉండడానికి ఎందుకు ఇష్టపడట్లేదు..? కారణాలు ఇవేనా..?
Next article73 సంవత్సరాల వయసులో మొగిలయ్య కష్టపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? కారణం ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.