“గోదావరి” సినిమా ముద్దుగుమ్మ “కమిలినీ ముఖర్జీ” గుర్తుందా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

Ads

సిని పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన హీరోయిన్స్ హఠాత్తుగా మాయమవుతుంటారు. అలా వెళ్ళినవారు వాళ్లు ఎక్కడున్నారు అనేది, ఏం చేస్తుంటారనేది తెలియదు.

Ads

అలా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన కమలిని ముఖర్జీ సడెన్ గా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్‌ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా 2004లో విడుదల అయ్యింది.
తన మొదటి చిత్రం ‘ఆనంద్‌’ తోనే టాలీవుడ్ ఆడియెన్స్ మనసు గెలుచుకుంది కమిలిని ముఖర్జీ. ఇక ఈ సినిమా తరువాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా ఆమె నటించిన గోదావరి, హ్యాపీడేస్‌, గమ్యం,గోపి గోపిక గోదావరి, జల్సా,నాగవల్లి వంటి సినిమాలు ద్వారా కమిలినికి మంచి పేరు వచ్చింది. బాలీవుడ్ లోనూ డెబ్యూ చేసినా, తెలుగులోనే పాపులర్ అయ్యి, ఎక్కువ పేరు సంపాదించుకుంది.ఆమె మలయాళం, తమిళ, బెంగాళీ సినిమాల్లోనూ నటించి అక్కడివారిని మెప్పించింది. మోహన్ లాల్ పక్కన హీరోయిన్ గా ‘పులిమురుగన్’ (మన్యంపులి) లో కూడా నటించింది. కమిలిని చివరి సారిగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఆమె ఏ సినిమాలోనూ నటించలేదు. కమిలిని చేసింది కొన్ని చిత్రాలు అయినప్పటికి తన నటన, అందంతో ఆకట్టుకున్న కమిలిని ముఖర్జీ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడింది.
అయితే సినిమాలకు దూరంగా ఉన్న కమిలిని బిజినెస్ లో బాగానే సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇన్ని రోజులు కనిపించని కమలినీ తాజాగా డల్లాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సందడి చేసింది. ఆ ఈవెంట్ లోని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో కమిలిని ముఖర్జీని చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. గోదావరి హీరోయిన్ ఇలా మారిపోయింది ఏంటి? అని కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read: చిరంజీవి తన ఫోన్ లో సురేఖ, పవన్ పేర్లను ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసా?

Previous articleసినిమాలను వదిలి సన్యాసం తీసుకున్న 5 గురు బాలీవుడ్ నటినటులు వీరే..
Next articleఊర్లో మనుషులు ఉండాలి కానీ… మనిషిలా ఉందేంటి ఈ ఊరు..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.