సమంత లాగే ప్రాణాంతక వ్యాధులతో పోరాడి గెలిచిన 5 గురు హీరోయిన్లు..

Ads

సిని పరిశ్రమలో ఇప్పటి వరకు చాలా మంది నటీమణులు ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడ్డారు. ఆ వ్యాది వచ్చిన తరువాత కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి కూడా వచ్చింది. అయితే ఆ హీరోయిన్స్  మనో ధైర్యంతో ఆ వ్యాధిని ఎదుర్కొని,ఆ వ్యాధుల నుండి కొలుకున్నారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
1.సమంత:
 సమంత పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత గత సంవత్సరం మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడినట్టు తెలిపారు. ఆమె ఈ మధ్యే ఆ వ్యాధి నుండి  కోలుకొని, సినిమాలలో నటించడానికి రెడీ అయ్యింది. మయోసైటిస్ అనేది అరుదైన వ్యాధి అయినప్పటికీ  సమంత ధైర్యంగా పోరాడి కోలుకుంది.
2.సుస్మితా సేన్:
బాలీవుడ్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్ కు ఇటీవలే గుండెపోటుకు వచ్చింది. వైద్యులు ఆమెకు యాంజియోప్లాస్టీ చేసి, స్టంట్‌ వేశారు. దాని నుండి సుస్మిత కోలుకున్నారు. తనకు గుండెపోటు వచ్చిన విషయాన్ని చెప్తూ, తాను ధైర్యంగా ఉండడం వల్లనే ప్రాణాలతో ఉన్నానని తెలిపారు.
3.హంసానందిని:
హీరోయిన్ హంసానందిని ఈగ, అత్తారింటికి దారేది, మిర్చి లాంటి చిత్రాలలో నటించి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమె దాదాపుగా సంవత్సరం పాటు క్యాన్సర్ తో పోరాడింది. క్యాన్సర్ నుండి  కోలుకున్న ఆమె ప్రస్తుతం సినిమాలతో బిజీ అయ్యింది.
4.సోనాలి బింద్రే:
సోనాలి బింద్రే టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించి ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. సోనాలి కూడా క్యాన్సర్ బారిన పడింది. అయితే ఆమె తన మనో ధైర్యంతో క్యాన్సర్ తో పోరాడి గెలిచి చాలా మందికి ఆదర్శంగా నిలిచింది.5.మమతా మోహన్ దాస్:
మమతా మోహన్ దాస్ 2 సార్లు క్యాన్సర్ బారిన పడింది. ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా  ధైర్యంగా నిలబడి రెండుసార్లు ఆ వ్యాధి నుండి చికిత్స చేయించుకొని కొలుకుంది. Also Read: ఎన్టీఆర్ భార్య బసవతారకం, చిరంజీవి భార్య సురేఖలో ఉన్న పోలిక ఏమిటో తెలుసా?

Previous articleఎండకాలంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే కలిగే ఆరోగ్య సమస్యలు ఇవే..
Next articleవెంకటేష్ సుందరకాండ హీరోయిన్ ”అపర్ణ” మీకు గుర్తు ఉన్నారా..? ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.