వీర సింహారెడ్డి సినిమాలో మొదట అనుకున్నది వరలక్ష్మిని కాదట.. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Ads

సంక్రాంతి పండగకి ఆడియెన్స్ ముందుకు వచ్చి, సూపర్ హిట్ తెచ్చుకున్న సినిమా వీర సింహారెడ్డి. నందమూరు నట సింహం బాలకృష్ణ నటించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా శృతిహాసన్, మలయాళ నటి హాని రోజ్ నటించారు.

ఇక ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. అఖండ మూవీతో ఎక్కడ లేని క్రేజ్ తెచ్చుకున్న బాలకృష్ణ, ఈ చిత్రంతో ఆ క్రేజ్ ని మరింత పెంచుకున్నారని చెప్పవచ్చు. వీర సింహారెడ్డి మూవీలో బాలయ్య లుక్ కూడా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. సినిమా అంతా ఆయనే ఉన్నా కూడా ఆడియెన్స్ కి బోరింగ్ ఫీల్ కలగలేదనే చెప్పాలి.ఈ సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ దునియా విజయ్ నటించాడు. ఆయన భార్య క్యారెక్టర్ లో వరలక్ష్మి నటించింది. అయితే ఆమె నెగెటివ్ పాత్రలో ఆకట్టుకుంది.ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ను నటనకు విమర్శకులు నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ రేంజ్ లో వరలక్ష్మి నటించిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఆమె బాలయ్య చెల్లెలుగా నటించడమే కాకుండా విలన్ దునియా విజయ్ కు భార్యగా నటించడం అనేది ఆడియెన్స్ ని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ చిత్రంలో అదే కీలకమైన పాయింట్.
అయితే వరలక్ష్మికి ఇంత మంచి పేరు తెచ్చిన ఈ క్యారెక్టర్ కి వరలక్ష్మి మొదటి ఛాయిస్ కాదంట. ఆమె కన్నా ముందు ఈ పాత్ర కోసం ఒక స్టార్ హీరోయిన్ ని ఎంచుకున్నారంట. ఇంతకి ఆమె ఎవరో హీరోయిన్ కీర్తి సురేష్. ఆమెకు సినిమా స్టోరిని విని, నో చెప్పారట.

Ads

ఇందులోని కొన్ని సీన్స్ కీర్తి సురేష్ కు నచ్చలేదని, అందువల్లే నో చెప్పారని తెలుస్తోంది. డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికి ఆమె రిజెక్ట్ చేశారంట.

Also Read: నటి రోజా తండ్రి ఎవరో, ఆయన నేపద్యం ఏమిటో తెలుసా..?

Previous articleచేతిలో డబ్బు నిలువ ఉండకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?
Next articleఅచ్చం సౌంద‌ర్య‌లాగే ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.