ఇవాళ జరగనున్న వైయస్ షర్మిల కొడుకు రిసెప్షన్ కి హాజరు కాబోతున్న ప్రముఖులు వీరే..! ఎవరెవరు ఉన్నారంటే..?

Ads

వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి గతవారం రాజస్థాన్ లో జరిగిన సంగతి తెలిసిందే. డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఈ పెళ్లి జరిగింది. ఎంతో ఘనంగా వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలని కూడా సోషల్ మీడియాలో షర్మిల విడుదల చేశారు.

మెహందీ, సంగీత్, హల్దీ వంటి వేడుకలు కూడా జరిగాయి. కొంత కాలం క్రితం వీరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఆ తర్వాత పెళ్లి కోసం రాజస్థాన్ లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఎంతో మంది సెలబ్రిటీల పెళ్లిళ్లు అక్కడే జరిగాయి.

guests for ys sharmila son reception

ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ వంటి ప్రముఖులు రాజస్థాన్ లోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇప్పుడు రాజారెడ్డి పెళ్లి కూడా అక్కడే జరిగింది. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ రాజారెడ్డి పెళ్లికి కూడా ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించారు. గతంలో ఎంతో మంది సెలబ్రిటీల పెళ్లిలకి ఈ ఫోటోగ్రాఫర్ గా జోసెఫ్ రాధిక్ చేశారు. జోసెఫ్ రాధిక్ ముఖ్యంగా సెలబ్రిటీ పెళ్లిళ్లకి మాత్రమే కాకుండా, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి ఫోటోగ్రాఫికి స్పెషలిస్ట్.

guests for ys sharmila son reception

Ads

అందుకే ఆయన ఫోటోగ్రఫీకి చాలా మంది అభిమానులు. ఈ కారణంగానే ఎంతో మంది సెలబ్రిటీలు కూడా జోసెఫ్ రాధిక్ ఫోటోగ్రఫీని ఇష్టపడతారు. ఇటీవల రకుల్ ప్రీత్ పెళ్లికి కూడా జోసెఫ్ రాధిక్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించారు. అయితే ఇదిలా ఉండగా, ఇవాళ రాజారెడ్డి, ప్రియా రిసెప్షన్ ఉంది. శంషాబాద్ లో ఉన్న గ్రాండ్ ఫోర్ట్ హోటల్ లో రిసెప్షన్ ఘనంగా జరుగుతుంది.

guests for ys sharmila son reception

ఇవాళ రిసెప్షన్ కి సినిమా రంగానికి చెందిన వారు రాజకీయ రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరు అవుతున్నారు. వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేజీ వేణుగోపాల్, డి కె శివకుమార్ కూడా హాజరు అవుతున్నట్టు సమాచారం.

guests for ys sharmila son reception

వీరితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో నుండి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా హాజరు అవుతారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా ఈ రిసెప్షన్ కి వస్తారు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి రిసెప్షన్ కి హాజరు అవ్వలేకపోవచ్చు అనే వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉండడం వల్ల వేడుకలకు హాజరు అవ్వలేకపోతున్నారు అని సమాచారం. ఇంకా కొంత మంది రాజకీయ రంగానికి చెందిన వారు, సినీ రంగానికి చెందిన వారు కూడా ఈ రిసెప్షన్ కి హాజరు అవుతారు.

ALSO READ : మెట్రో ట్రైన్ లో లో “నెక్స్ట్ స్టేషన్ అనౌన్స్మెంట్” చెప్పే వ్యక్తిని ఎప్పుడైనా చూశారా..? ఆయన ఎవరంటే..?

Previous articleOTT లోకి వచ్చిన ఈ కళ్యాణి ప్రియదర్శన్ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?
Next articleకాబోయే కోడలి కోసం అంబానీ ఇస్తున్న బహుమతుల లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! ఏం ఉన్నాయంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.