అక్కడ ముందుగా పూలవర్షం కురిపించారు తరువాత కోడిగుడ్లతో కొట్టారని మెగాస్టార్ కామెంట్స్..

Ads

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య పోటీ ఉంటుంది. ఇక పండుగల వేళలో అయితే అగ్ర హీరోల చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం అనేది అందరికి తెలిసిన విషయమే. కాగా ప్రస్తుతం ఓటీటీల షోల మధ్య కూడా గట్టి పోటీనే ఉందని చెప్పవచ్చు.

ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఫైనల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన పార్ట్2. ఇక ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదే రోజున సోనీ లివ్ ఓటీటీలో ‘నిజం విత్ స్మిత’ షో కూడా ప్రారంభం కానుంది. ఈ షోలో మొదటి ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది.
ఈ ప్రోమోలో వాఖ్యత స్మిత అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాలేజ్ రోజుల్లో మొదటి క్రష్ ఎవరని అడిగినపుడు ఆ ప్రశ్నకు చిరంజీవి వెరైటీ ఎక్స్ ప్రెషన్ పెట్టారు. స్టార్ డమ్ అనేది కొంతమందికే, ఆ స్థానానికి వెళ్లాలంటే చాలా అవమానాలు, అనుమానాలు అని అడిగినపుడు మెగాస్టార్, తన జీవితంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం గురించి చెప్పారు.

Ads

నేను జగిత్యాల వెళ్ళినపుడు పై నుండి పూల వర్షం కురిపించారని, కానీ కొంచెం దూరం వెళ్లగానే కోడిగుడ్లతో కొట్టారని తెలిపారు. ఆ తరువాత ఇండస్ట్రీలో మళ్లీ ఒక వర ప్రసాద్ మెగాస్టార్ అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందంటారా అని స్మిత అడిగారు. దానికి మెగాస్టార్ ఏమని జవాబు చెప్పారో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేదాకా వేచి చూడాల్సిందే. ఇక ఈ షోకు సినీ ప్రముఖులతో పాటు,రాజకీయ నేతలు కూడా రానున్నారని తెలుస్తోంది. ఇక ఈ షోకు గెస్ట్ గా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా రానున్నారు.
Also Read: అత్యంత ధనవంతులైన టాప్ 5 టాలీవుడ్ హీరోలు వీళ్ళే..!

Previous articleక్రికెటర్ దినేశ్ కార్తీక్ మొదటి భార్య నికితా వంజర, మురళీ విజయ్ భార్యగా ఎలా మారిందంటే..
Next article“క్రాక్” సినిమాలో విలన్ కఠారి కృష్ణ ఎవరు ? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ఎం చేస్తున్నాడంటే ?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.