”నువ్వే కావాలి” హీరోయిన్ గుర్తున్నారా..? ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

Ads

కొంత మంది నటీ నటులు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ మనం వాళ్ళని మర్చిపోలేక పోతూ ఉంటాము. పైగా వాళ్ళు కొన్ని సినిమాల్లో నటించినా సరే వాళ్ళు మన మనసుకు బాగా దగ్గర అయిపోతూ ఉంటారు. నిజానికి ఇండస్ట్రీ లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఒక్కొక్క సారి అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటే ఒక్కొక్క సారి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి.

కానీ నటీ నటులు ఎప్పుడు కూడా వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుని అవకాశాలు వచ్చినంత వరకు వినియోగం చేసుకుంటూ ఉండాలి లేకపోతే కెరీర్ ముగిసిపోయే ప్రమాదం ఉంది.

పైగా హీరోయిన్లకి ఎక్కువ కెరీర్ ఉండదు. త్వరగా వారి కెరీర్ ముగిసిపోగుతూ ఉంటుంది. హీరోలకి మాత్రం ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. వాళ్ల కెరీర్ ఎక్కువ కాలం నడుస్తూ ఉంటుంది. చాలామంది హీరోయిన్స్ ఇప్పటికే దూరమైపోయారు. వారిలో రిచా పల్లాడ్ కూడా ఒకరు. ఈమె గురించి మనం కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నువ్వే కావాలి సినిమాతో ఈమె బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తెలుగు ప్రజలకి బాగా దగ్గరయి తిరుగులేనంత క్రేజ్ ని కూడా సంపాదించుకున్నారు.

Ads

నువ్వే కావాలి సినిమాకి విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా.. తరుణ్ హీరోగా నటించారు. ఈ సినిమా వచ్చి సుమారు 22 సంవత్సరాలు అవుతోంది ఇప్పటికి కూడా ఈ సినిమాని చాలా మంది చూస్తూ ఉంటారు. ఎన్ని సార్లు చూసినా బోర్ కూడా కొట్టదు. కానీ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రిచా కెరీర్ మాత్రం త్వరగా ముగిసిపోయింది. 2011 వ సంవత్సరంలో హిమాన్షు బజార్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ని ఈమె వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. 2016 లో ఈమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మలుపు చిత్రంలో నటించారు. ఆ సినిమా తర్వాత మళ్లీ మాయమైపోయారు. ఈమె ప్రస్తుతం ఈమె తన భర్తకి తోడుగా ఉంటున్నారు. అలానే కుటుంబ బాధ్యతల్ని కూడా తీసుకున్నారు.

Previous articleమొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసిన హీరోయిన్ పెళ్లి ఫొటోస్…ఎవరో గుర్తుపట్టారా.?
Next articleబాలయ్య క్రేజ్ మాములుగా లేదుగా…తమిళ సినిమాలో కూడా “జై బాలయ్య” డైలాగ్.! ఎందులో అంటే?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.