నందమూరి కుటుంబంలో ఎక్కువగా కష్టాలను ఎదుర్కొన్నది ఈ ఇద్దరు మాత్రమే..

Ads

నందమూరి తారక రామారావు ఈ పేరు తెలుగువారికి పరిచయం అవసరం లేనిది. ఆయన తన స్టార్‌ డమ్ తో తెలుగు గడ్డ పై మాత్రమే కాకుండా నేషనల్ వైడ్ గా గుర్తింపును పొందారు.

Ads

ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా నందమూరి కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటారంటే కేవలం ఎన్టీ రామారావు వల్లనే అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. తన కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలిపిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు. నాటసార్వభౌమునిగా పేరు గాంచిన ఇండస్ట్రీలో మరచిపోలేని ముద్రను వేశారు. ఆయన సినీ రంగంలోనే కాకుండా రాజకీయాలలోనూ రాణించారు. తెలుగు దేశం పార్టీని స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గొప్ప నాయకుడు.
ఆయన వారసులుగా హరికృష్ణ మరియు బాలకృష్ణలు ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగు పెట్టారు. వీరిలో బాలకృష్ణ ఇప్పటికి అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఇక ఎన్టీ రామారావుగారు వందల కోట్ల విలువైన ఆస్తులను తన కుమారులకి మరియు కుమార్తెలకి ఇచ్చారు. అయినప్పటికి ఎన్టీఆర్‌ మనవల్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, తారకరత్నలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జూనియర్ ఎన్టీఆర్‌ ఆర్థికంగా కొంచెం ఇబ్బందిని ఎదుర్కొన్నా, చిన్నతనంలో కుటుంబ సభ్యులు పట్టించుకోక పోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాడట. దానికి కారణం హరికృష్ణ రెండవ భార్య కుమారుడు అవ్వడంతో ఎన్టీఆర్‌ ను నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టేందుకు చాలా ప్రయత్నించిందట. అయితే తర్వాత కాలంలో వారే ఎన్టీఆర్‌ దగ్గరకు వచ్చారు.
ఇక తారకరత్న విషయానికి వస్తే ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆయనను నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టిందంట. ఆ పెళ్లి వద్దని ఎంత చెప్పినా తారకరత్న వినకుండా పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేలా చేసింది. అయితే ఒక సమయంలో ఫ్యామిలీ పోషణ కూడా తారకరత్నకు ఇబ్బందిగా ఉండేదని కొందరు చెబుతున్నారు. అయితే మరణించడానికి ముందు తారకరత్న ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాడు.
Also Read: ఎన్టీ రామారావు, తారకరత్న మరణాలకు మధ్య ఉన్న పోలిక ఏమిటో తెలుసా..!

Previous articleఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘కొమురం భీముడో పాట’ వెనుక ఉన్న స్టోరిని చెప్పిన రాజమౌళి..!
Next articleతారకరత్న మరణించిన రెండు రోజులకే ఆయన భార్య అలేఖ్య రెడ్డి సంచలన నిర్ణయం..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.