Ads
నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈమె సినిమాల ద్వారా కంటే వివాదాల ద్వారానే ఎక్కువగా లైమ్ లైట్ లో ఉంటారు. కుటుంబ వివాదాల ద్వారా కొన్నిసార్లు, పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ కొన్నిసార్లు అలా నిత్యం ట్రోల్స్ కి గురవుతూనే ఉంటారు. ఈ వివాదాలు కారణంగానే ఆమెని కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా దూరంపెట్టారు.
రీసెంట్ గా ప్రముఖ నటుడు విజయ్ కుమార్ మనవరాలు దియా పెళ్లికి ఆమెకి ఆహ్వానం పంపించలేదు ఆమె కుటుంబ సభ్యులు, దీనిపై వనిత ఇన్స్టా స్టోరీ లో స్పందించారు. దియా వివాహానికి ఆహ్వానం అందకపోవటంపై వనిత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఒకచోట గుమిగూడిన గుంపు మధ్యాహ్నం ఒంటరిగా నడుస్తున్నట్లు వీడియోని పోస్ట్ చేశారు. గతంలో వనిత విజయ్ కుమార్ తన తండ్రి గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ads
ఒక ఇంటర్వ్యూలో విజయ్ కుమార్ తన పిల్లల అందరి పేర్లు చెప్పి తన పేరు మాత్రం చెప్పలేదని, ఆయన చెప్పకపోయినా ఈ ప్రపంచానికి నేను ఆయన కూతురు అని తెలుసని వనిత అన్నారు. నా తండ్రి మాటలను వినటం వలనే నా జీవితం నాశనం అయ్యింది అంటూ ఎమోషనల్ అయ్యారు వనిత. అయితే ఆ వ్యాఖ్యలు అప్పుడు తెగ వైరల్ అయ్యాయి మళ్ళీ ఇప్పుడు అదే న్యూస్ వైరల్ అవుతుంది.ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే తళపతి విజయ్ కి జోడిగా చంద్రలేఖ అనే సినిమాతోహీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కెరియర్ లో సెటిల్ అవుతున్న టైం లో నటుడు ఆకాష్ ని పెళ్లి చేసుకుని తర్వాత ఏడాదికే విడాకులు ఇచ్చి ఆనంద్ అనే బిజినెస్మేన్ ని పెళ్లి చేసుకున్నారు వనిత. అతని నుంచి విడిపోయి పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కొద్దిరోజుల్లో అతడిని కూడా దూరం పెట్టేశారు వనిత. గత ఏడాది పీటర్ పాల్ చనిపోయినప్పుడు అతను తన భర్త కాదని, అసలు మా ఇద్దరికీ పెళ్లి జరగలేదు అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది వనిత.